Skip to main content

Posts

మూడు, నాలుగు రోజుల్లో కరోనా వ్యూహం ఖరారు-కేసీఆర్

జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజులపాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. Also Read: బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో వైద్యఆరోగ్య శాఖ

పీవీని స్మరించుకున్న తెలంగాణ జనత

  భారతదేశానికి ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఓ మారుమూల గ్రామంలో పుడతాడని, అందులోనూ భారత ప్రధాని వంటి అత్యున్నత పదవికి పోటీపడే ఉత్తరభారతంలోని ఉన్నతమైన కుటుంబాల రాజకీయ పోటీని తట్టుకొని.. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని కాబోయే వ్యక్తి పుడతాడని ఎవరైనా ఊహించగలరా? కానీ పాములపర్తి వేంకట నరసింహారావు అలియాస్ పీవీ నరసింహారావు విషయంలో అది నిజమైంది. ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే పీవీ రాజనీతి దేశంలోనే కాదు.. ఖండాంతరాలు కూడా వ్యాపించింది. ఎందుకంటే.. ఆయనకు అంత ఖ్యాతి వ్యక్తిగతమైన స్వచ్ఛత, సౌశీల్యతల వల్ల వచ్చింది కాదు. దేశ ప్రజలు మెచ్చిన పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల వల్ల వచ్చింది. రాజకీయ చాణిక్యుడు... భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ప్రాంతం ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం అనే సిద్ధాంతంతో పాలన సాగించిన రాజనీతికోవిదుడు.. తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది పట్టాలెక్కించిన ప్రధాని ఆయన. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలపాటు విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించిన ప్రధాని కూడా ఆయనే.  వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి,  సీతారామారావు

ఓ కోతిని కొట్టి చంపి, మరో కోతిని ఉరేసి.. వైరల్ వీడియో

  ప్రకృతి మీదనే ఆధారపడి బతుకుతున్న మనిషి.. ఆ ప్రకృతి వైవిధ్యాన్ని మాత్రం కాపాడటం లేదు. పైగా మూగజీవాల పాలిట రాక్షసుడిగా మారుతున్నాడు. కరోనా వంటి మహమ్మారి మానవాళిని శాసిస్తున్నా కూడా ఇతర ప్రాణుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. మానవత్వం మరచి అడవి జంతువుల  కన్నా హీనంగా వ్యవహరిస్తున్నాడు.  ఖమ్మం జిల్లా జిల్లా వేంసూర్ మండలంలో మానవ సమాజం అసహ్యించుకునేలా ఓ కోతిని ఉరేసి చంపారు కొందరు ప్రబుద్ధులు. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యం చక్కర్లు కొడుతున్నా కూడా సంబందిత అటవీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.పైగా ఇదేంటని ప్రశ్నించినవారికి దురుసుగా సమాధానం ఇస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది.  సాధు వెంకటేశ్వరావు, పాస్టర్ జోసెఫ్ రాజ్ ఇళ్ళ సమీపంలో ఓ నీటి తొట్టిలో వానరం పడిపోయి కొట్టుమిట్టాడుతోంది. మానవతా దృక్పథంతో కోతిని కాపాడాల్సిన వారిద్దరూ వానారాన్ని కర్రలతో కొట్టి చంపి బయట పడేశారు. చనిపోయిన వానరం వద్దకు మరికొన్ని కోతులు రావటంతో జోసెఫ్ రాజ్, వేంకటేశ్వరావు మరో కోతిని పట్టుకుని సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసి కుక్కలతో కరిపిస్తు హతమార్చారు

జయశంకర్ ను స్మరించుకున్న నేతలు, విశ్వబ్రాహ్మలు

  నువ్వు నాయకుడు అవుదామనుకున్న ప్రతిరోజూ నీకు పదిమంది వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటారు. అదే నువ్వు పది మంది నాయకులను తయారు చేస్తే నీ లక్ష్యానికి వాళ్లంతా తోడుగా నిలిచి  నిన్ను నాయకుడిని చేస్తారు. - కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్ ------------------ యావత్ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సమావేశాలు జరిగాయి. అయితే లాక్ డౌన్ కారణంగా పెద్దఎత్తున సభలు, సమావేశాలను ఎవరూ ఏర్పాటు చేయకపోయినా.. పలువురు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఇతర యాక్టివిస్టులు, అటు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు విడివిడిగా ఎవరి ఇళ్లలో వారే నివాళులు అర్పించి జయశంకర్ సార్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి విజయం సాధించి ప్రజలకు అప్పగించి అనంత లోకాలకేగిన జయశంకరుడు ఆశించిన ఫలాలు మాత్రం సమాజానికి అందడం లేదని, జయశంకరుడి జాతికే చెందిన విశ్వకర్మలు మరీ అణచివేతకు గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ జాతి స్వేచ్ఛ కోసం పోరాడిని జాతి ప్రజలే ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.  ఆచార్య జయశంకర్ సార్‌కు నివాళుర్పించిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాం

జయశంకర్ సార్ స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిద్దాం

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడలో స్థానిక విశ్వబ్రాహ్మణులు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం సర్వస్వాన్ని అర్పించడమే గాక, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న జయశంకర్ సార్ సేవలను కొనియాడారు. ఆయన జీవితంలో తెలంగాణ సాకారాన్ని చూడకపోయినా... కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం చూసి ఆయన ఎంతో ఆనందించారని సమావేశానికి హాజరైన సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా తెలంగాణను ఇక ఎవరూ ఆపలేరని అందరితో చెప్పిన జయశంకర్ సార్.. అదే ఆత్మవిశ్వాసంతో కడదాకా ఉన్నారన్నారు.  ఆయన మాత్రమే గాక తెలంగాణ కోసం తొలిసారి బలపీఠమెక్కి.. ఉద్యమాన్నని రగిలించిన శ్రీకాంతాచారి వంటి ఎందరో విశ్వకర్మల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. అలాంటి విశ్వకర్మల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అదే విశ్వకర్మలు ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని, అయినా అన్ని వర్గాలకు ఎంతో కొంత సాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విశ్వకర్మల పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. ఇకనైనా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజం పోరాటాలకు ముందుకొచ్చి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపుని

కొత్త కమిటీలతో విస్తరిస్తున్న విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్

దేశ చరిత్ర నిర్మాతలైన విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మలకు వారి నేపథ్యంపై సంపూర్ణమైన అవగాహన కల్పించేందుకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పని చేస్తోందని, ఈ క్రమంలో ఆ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని వీకేసీ జాతీయ కార్యదర్శి జైన్ కుమార్ ఆచార్య చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణలో నియోజకవర్గ స్థాయిలో ఆ సంస్థ కమిటీలు వేస్తున్నామని ఆచార్య జైన్ తో పాటు వీకేసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిళ్ల వేణుఆచార్య చెప్పారు. తాము ఎంపిక చేసిన నాయకులకు నియామక పత్రాలు అందజేశామని వారన్నారు. వీకేసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసోజు నాగభూషణం, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్లుగా సింగోజు శశిధర్, మామిడాల వెంకీ ఆచార్య, గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా చెలకుర్తి విష్ణు, గ్రేటర్ హైదరాబాద్ గోషామహల్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా చెన్నోజు ప్రదీప్ కుమార్ తదితరులను నియమించినట్లుగా వారు చెప్పారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న బాధ్యులు భాగ్యనగర్ పోస్టుతో మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అభివృద్ధికి, విశ్వకర్మీయుల్లో చైతన్యానికి తమవంతుగా కృషి చేస్తామని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించ

రోడ్డు మీద పడ్డ అత్యంత వెనుకబడ్డ కులాలు

- కె.సి.కాళప్ప, జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు     9848451544   భారత ప్రజలకు స్వాతంత్య్రం రాకముందు కులవృత్తులు చేసుకునే ప్రజలు ఎంతో గౌరవంగా బతికారు. ఆదాయం పెద్దగా లేకపోయినా సమాజమంతా వారి వృత్తుల మీదనే ఆధారపడి నడిచినందువల్ల ఆయా వృత్తి కులాల్లో ఆకలికేకల జాడ కనిపించలేదు. ఉన్నంతలో సంతృప్తిగానే కుటుంబాలు వెళ్లదీసుకున్నారు. మిగతా ఉన్నతవర్గాలతో, ధనవంతులతో పోల్చుకుంటే వారు పేదరికంలోనే  ఉన్నప్పటికీ స్వయంసమృద్ధిగానే వృత్తిపని సమాజం బతికింది. ఈ పరిస్థితి స్వాతంత్య్రం తరువాత దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కూడా కొనసాగింది. 1990ల్లో ఆర్థిక సంస్కరణలు మొదలైన తరువాత వృత్తిపని సమాజంలో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవించాయి. చేతివృత్తులు రోజురోజుకూ పూర్తిగా కనుమరుగైపోతూ విశాల ప్రపంచం నుంచి అనేక అవసరం లేని వస్తువులు సైతం మన ఇళ్లను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మన దేశ చేతివృత్తులు చేసుకునే ప్రజలకు ఆదరువు లేకుండాపోయింది.  ఈ పరిస్థితులు ఇలా ఉంటే కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐదో దఫా లాక్ డౌన్ నడుస్తోంది. లాక్ డౌన్ లో సడలింపుల కారణంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇప్పటికే రెండు నెలలకు పైగా ఉ