Skip to main content

Posts

జయశంకర్ ను స్మరించుకున్న నేతలు, విశ్వబ్రాహ్మలు

  నువ్వు నాయకుడు అవుదామనుకున్న ప్రతిరోజూ నీకు పదిమంది వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటారు. అదే నువ్వు పది మంది నాయకులను తయారు చేస్తే నీ లక్ష్యానికి వాళ్లంతా తోడుగా నిలిచి  నిన్ను నాయకుడిని చేస్తారు. - కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్ ------------------ యావత్ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సమావేశాలు జరిగాయి. అయితే లాక్ డౌన్ కారణంగా పెద్దఎత్తున సభలు, సమావేశాలను ఎవరూ ఏర్పాటు చేయకపోయినా.. పలువురు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఇతర యాక్టివిస్టులు, అటు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు విడివిడిగా ఎవరి ఇళ్లలో వారే నివాళులు అర్పించి జయశంకర్ సార్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి విజయం సాధించి ప్రజలకు అప్పగించి అనంత లోకాలకేగిన జయశంకరుడు ఆశించిన ఫలాలు మాత్రం సమాజానికి అందడం లేదని, జయశంకరుడి జాతికే చెందిన విశ్వకర్మలు మరీ అణచివేతకు గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ జాతి స్వేచ్ఛ కోసం పోరాడిని జాతి ప్రజలే ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.  ఆచార్య జయశంకర్ సార్‌కు నివాళుర్పించిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాం

జయశంకర్ సార్ స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిద్దాం

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడలో స్థానిక విశ్వబ్రాహ్మణులు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం సర్వస్వాన్ని అర్పించడమే గాక, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న జయశంకర్ సార్ సేవలను కొనియాడారు. ఆయన జీవితంలో తెలంగాణ సాకారాన్ని చూడకపోయినా... కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం చూసి ఆయన ఎంతో ఆనందించారని సమావేశానికి హాజరైన సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా తెలంగాణను ఇక ఎవరూ ఆపలేరని అందరితో చెప్పిన జయశంకర్ సార్.. అదే ఆత్మవిశ్వాసంతో కడదాకా ఉన్నారన్నారు.  ఆయన మాత్రమే గాక తెలంగాణ కోసం తొలిసారి బలపీఠమెక్కి.. ఉద్యమాన్నని రగిలించిన శ్రీకాంతాచారి వంటి ఎందరో విశ్వకర్మల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. అలాంటి విశ్వకర్మల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అదే విశ్వకర్మలు ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని, అయినా అన్ని వర్గాలకు ఎంతో కొంత సాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విశ్వకర్మల పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. ఇకనైనా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజం పోరాటాలకు ముందుకొచ్చి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపుని

కొత్త కమిటీలతో విస్తరిస్తున్న విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్

దేశ చరిత్ర నిర్మాతలైన విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మలకు వారి నేపథ్యంపై సంపూర్ణమైన అవగాహన కల్పించేందుకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పని చేస్తోందని, ఈ క్రమంలో ఆ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని వీకేసీ జాతీయ కార్యదర్శి జైన్ కుమార్ ఆచార్య చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణలో నియోజకవర్గ స్థాయిలో ఆ సంస్థ కమిటీలు వేస్తున్నామని ఆచార్య జైన్ తో పాటు వీకేసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిళ్ల వేణుఆచార్య చెప్పారు. తాము ఎంపిక చేసిన నాయకులకు నియామక పత్రాలు అందజేశామని వారన్నారు. వీకేసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసోజు నాగభూషణం, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్లుగా సింగోజు శశిధర్, మామిడాల వెంకీ ఆచార్య, గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా చెలకుర్తి విష్ణు, గ్రేటర్ హైదరాబాద్ గోషామహల్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా చెన్నోజు ప్రదీప్ కుమార్ తదితరులను నియమించినట్లుగా వారు చెప్పారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న బాధ్యులు భాగ్యనగర్ పోస్టుతో మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అభివృద్ధికి, విశ్వకర్మీయుల్లో చైతన్యానికి తమవంతుగా కృషి చేస్తామని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించ

రోడ్డు మీద పడ్డ అత్యంత వెనుకబడ్డ కులాలు

- కె.సి.కాళప్ప, జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు     9848451544   భారత ప్రజలకు స్వాతంత్య్రం రాకముందు కులవృత్తులు చేసుకునే ప్రజలు ఎంతో గౌరవంగా బతికారు. ఆదాయం పెద్దగా లేకపోయినా సమాజమంతా వారి వృత్తుల మీదనే ఆధారపడి నడిచినందువల్ల ఆయా వృత్తి కులాల్లో ఆకలికేకల జాడ కనిపించలేదు. ఉన్నంతలో సంతృప్తిగానే కుటుంబాలు వెళ్లదీసుకున్నారు. మిగతా ఉన్నతవర్గాలతో, ధనవంతులతో పోల్చుకుంటే వారు పేదరికంలోనే  ఉన్నప్పటికీ స్వయంసమృద్ధిగానే వృత్తిపని సమాజం బతికింది. ఈ పరిస్థితి స్వాతంత్య్రం తరువాత దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కూడా కొనసాగింది. 1990ల్లో ఆర్థిక సంస్కరణలు మొదలైన తరువాత వృత్తిపని సమాజంలో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవించాయి. చేతివృత్తులు రోజురోజుకూ పూర్తిగా కనుమరుగైపోతూ విశాల ప్రపంచం నుంచి అనేక అవసరం లేని వస్తువులు సైతం మన ఇళ్లను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మన దేశ చేతివృత్తులు చేసుకునే ప్రజలకు ఆదరువు లేకుండాపోయింది.  ఈ పరిస్థితులు ఇలా ఉంటే కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐదో దఫా లాక్ డౌన్ నడుస్తోంది. లాక్ డౌన్ లో సడలింపుల కారణంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇప్పటికే రెండు నెలలకు పైగా ఉ

విశ్వబ్రాహ్మల ఆకలి కేకలు వినండి

పనికి ముందుండి తిండికి వెనకుండే విశ్వబ్రాహ్మలను ఆదుకోవాలని, ఈ సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించి కష్టకాలంలో ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూరి లక్ష్మణాచారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభించి, లాక్ డౌన్ విధించిన తరువాత అందరికంటే ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులే జీవనోపాధి కోల్పోయారని, పనులు చేయించుకునేవారు లేక జీవనోపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి ఇళ్లు, ఇరుకైన ఇళ్లలో పిల్లాపాపలతో జీవించడం ఎంతో కష్టంగా ఉందని, తెలంగాణ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇకనైనా పూర్తి చేసి పేదలకు కనీస వసతులు సమకూర్చాలని లక్ష్మణాచారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సిద్ధించి ఆరేళ్లు పూర్తయినా విశ్వబ్రాహ్మలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలూ అందలేదన్నారు. ఎన్నికలకు ముందు రుణాలు ఇస్తామన్న కేసీఆర్ ఎన్నికలు పూర్తయ్యాక కనీసం తాము పెట్టుకున్న అప్లికేషన్ల స్టేటస్ ఏంటో కూడా తెలిపే పరిస్థితి లేదన్నారు. కనీసం తమకు లోన్లు ఇచ్చినా ఏదో రకంగా ఈ కరోనా కష్టకాలాన్ని అధిగమించేవారమన్నారు.

పోరాట యోధులకు ప్రశంసా పత్రాలు

కోవిడ్-19 వైరస్ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు ముందు వరుసలో ఉండి పోరాడిన యోధులను ప్రోత్సహించేందుకు ప్రణవి ఫౌండేషన్ ముందుకొచ్చింది. అన్నార్తుల ఆకలిబాధలు తీర్చినవారైనా, నగదు సాయం చేసి ఆదుకున్నవారైనా, స్లమ్ ఏరియాల్లో ఉండే పేదలకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించినవారైనా.. ఇలా ముందువరుసలో ఉండి తమదైన కర్తవ్యం స్వచ్ఛందంగా నిర్వహించినవారిని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నట్టు ప్రణవి ఫౌండేషన్ అధ్యక్షులు జైన్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ప్రజాసేవలో స్వచ్ఛందంగా పనిచేసిన ఎవరైనా తాము పనిచేసినట్టు రుజువుగా చూపే ఒక ఫొటోతో పాటు వారి పాస్ పోర్టు సైజు ఫొటోను కూడా తమకు మెయిల్ చేయాలని కోరారు. అదే మెయిల్ ఐడీకి ప్రశంసాపత్రాన్ని పంపిస్తామన్నారు. మెయిల్ ఐడీ- pranavifoundation@gmail.com గా చెప్పారు.  ఇదే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ, మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆరకంటి కృష్ణయ్యకు జైన్ కుమార్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కుటుంబాన్ని, వ్యక్తిగత పరిమితులను లెక్కలోకి తీసుుకోకుండా కరోనాకు వ్యతిరేకంగా పోరాడారని జైన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి.శ్రీకాంత్ కూడా పాల్గొన్నార

మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారా? 

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. మరో దఫా లాక్ డౌన్ మరింత పకడ్బందీగా విధించడం తప్ప మార్గం లేదని అనేక వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం మీద అటు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ప్రచారం సాగుతోంది. మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే తప్ప ప్రజలకు రక్షణ లేదని, కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతన్న క్రమంలో లాక్ డౌనే శరణ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు కేంద్రం కూడా ఇదే విషయాన్ని సీరియస్ గా చర్చిస్తోందని, జూన్ 15 తరువాత గానీ, కాస్త అటుఇటుగా గానీ లాక్ డౌన్ విధించడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కేంద్రం ప్రభుత్వమే స్వయంగా వెల్లడిస్తుందంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో మరో దఫా సంపూర్ణ లాక్ డౌన్ వార్తలు పుకార్లేనని తేల్చినట్లయింది.  ఆందోళనకరంగా కేసులు భారత్ లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజుకు 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడల