Skip to main content

Posts

Showing posts with the label DEVOTIONAL

సీతను అడవికి పంపడంలో చాకలి పాత్ర ఎంత?

రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.  జాతి నింద ఏముంది? తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.  వృత్తాంతాన్ని పరిశీలిద్దాం రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొన

వార్తల్లోకెక్కిన వెయ్యేళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం

  భారత్ ప్రాచీన దేశం. పేరుకు తగినట్టే పురాతన విగ్రహాలకు, ప్రాచీన సంస్కృతికి, వెల కట్టలేని సాంస్కృతిక వైభవానికి మన దేశం పెట్టింది పేరు. పైన ఫొటోలో చూస్తున్న విగ్రహం విష్ణుమూర్తిది. అనంత పద్మనాభస్వామి అనగానే కేరళలో ఉన్నాడనే అందరూ గుర్తు చేసుకుంటారు. కానీ అలాంటి అనంత శయనుడి విగ్రహాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. దాదాపు అలాంటి భంగిమలోనే మధ్యప్రదేశ్ లోని బాంధవగఢ్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. విగ్రహానికి అంతా నాచుపట్టి, నిరాదరణకు గురైన స్థితిలో ఉంది. కానీ విగ్రహం ఒరిజినాలిటీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండడంతో సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇది వెయ్యేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. పార్కుకు వచ్చే సందర్శకులు ఈ విగ్రహాన్ని చూసి, ఆ పుణ్యస్థలానికి పునర్వైభవం తేవాలని కోరుతున్నారు.