రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థను (ఆర్టీసీ) కొత్తపుంతలు తొక్కిిస్తున్న ఎండీ సజ్జనార్ మరో కొత్త ఆఫర్ తో ముందుకొచ్చారు. ఆంగ్ల సంవత్సరాది, జనవరి ఫస్టును పురస్కరించుకొని 12 ఏళ్ల లోపువారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సజ్జనార్ కల్పించారు. ఆ ఒక్కరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా వారి వెంట ఉండాలి. ఆర్టీసీ ప్రయాణంలో ఉండే సౌకర్యం, భద్రతతో పాటు పెరిగిన పెట్రో ధరల కారణంగా ప్రైవేట్ సర్వీసుల్లో ప్రయాణం చాలా కాస్ట్ లీ గా తయారైన దరిమిలా ఈ సౌకర్యాన్ని పేరెంట్స్, పిల్లలు ఉపయోగించుకోవాలని సజ్జనార్ సూచించారు. పేద, మద్య తరగతి ప్రజలు జనవరి ఫస్టు రోజున సెలబ్రేషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ సర్వీసును ఉపయోగించుకోవచ్చని కోరారు. ప్రభుత్వ అధికారులందరూ ఈ విషయాన్ని పెద్దస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. సజ్జనార్ ఇప్పటికే జంట నగరాల్లో రూ. 100 కే 24 గంటలు అన్ని సర్వీసుల్లోనూ తిరగగలిగేలా టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) ఆఫర్ పరిచయం చేశారు. సిటీలోని ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.