Skip to main content

Posts

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

మా దేవీదేవతలకు పూజ చేసుకోనివ్వండి: ఎంపీ అర్వింద్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో గల ఓ ప్రధాన దేవాలయంలోకి హిందువులను అనుమతించి, అక్కడ పూజలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేస్తున్నారు. బోధన్ లో గల ఇంద్రనారాయణస్వామి ఆలయాన్ని హిందువులకు అప్పగించాలని ఆయన కోరుతున్నారు. 10 శతాబ్దంలో బోధన్లో ఇంద్రనారాయణుడి దేవాలయాన్ని ఆనాటి రాష్ట్రకూట రాజైన మూడో ఇంద్రుడు నిర్మించాడని.. అది జైన్ టెంపుల్ గా చరిత్రకారులు నిర్ధారించారని అర్వింద్ చెబుతున్నారు. ఆ తరువాత కళ్యాణి చాళుక్యుల కాలంలో రాజా సోమేశ్వరుడి హయాంలో ఆలయాన్ని పునరుద్ధరించి దానికి ఇంద్రనారాయణస్వామి దేవాలయంగా నామకరణం చేశారన్నారు.  ఆలయ నిర్మాణం నక్షత్రాకారంలో ఉంటుంది. ఎంతో అద్భుతమైన, ఆకర్షణీయమైన శిల్పాలు దేవాలయంలో ఆశ్చర్యం గొల్పుతాయి. ఆనాటి శిల్పాచార్యుల ప్రతిభకు దేవాలయ గోడలపై ఉన్న శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆక్రమణ తరువాత దాన్ని మసీదుగా మార్చారు. దానికి దేవల్ మసీద్ అనే పేరు పెట్టారు. గర్భగుడిని మార్చి.. ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వేదికను నిర్మించి.. మిగిలిన దేవాలయాన్ని పూర్తిగా అలాగే ఉంచి దేవల్ మసీదు

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో  తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతనోత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టీయూజేఎస్‌ కన్వీనర్‌ ఎం.ఎం.రహమాన్‌ ముఖ్యమంత్రికి వివరించారు.  ముఖ్యమంత్రి తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరిస్తూ ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని, అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎంకు రహమాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఓం చీఫ్‌ పీఆర్‌ఓ అయోధ్యరెడ్డిలకు సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో నేతలు మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, యాటకర్ల మల్లేష్‌, పసూనూరి రవీందర్‌, తాటికొండ రమేష్‌బాబు, సాదిక్‌, కాసిపేట నరేందర్‌ తదితర

యాభై రోజుల్లోనే పాస్ మార్కులు కొట్టేసిన రేవంత్

- కూర సంతోష్, సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది. సీఎంగా రేవంత్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. 2 హామీలు చేశామని చెబుతున్న ఆయన మిగతా అమలుకు కసరత్తు చేస్తున్నారు. మంత్రులకు సామాన్య ప్రాధాన్యం ఇస్తూ కేబినెట్ సమిష్టి తత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు  అధికారుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భిన్నాభిప్రాయాలు, అసంతృప్తులకు మారు పేరైన కాంగ్రెస్ లో ఎవరూ నిరాశ చెందకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. Read this also: ఆనాడు బూర్గుల.. నేడు రేవంత్ Read this also: జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి తెగిన కంచెలు సీఎంగా ప్రమాణం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్ ముందు ఉన్న కంచె తొలగింపజేశారు రేవంత్. గతంలో ప్రగతి భవన్ లోకి సామాన్యులకే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులకే అనుమతి ఉండేది కాదు. కానీ రేవంత్ ప్రజావాణి ద్వారా ప్రగతి భవన్ లోకి ఎంట్రీ కల్పించారు. వారంలో 2 రోజులు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించడానికి స్పెషల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గతంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వాటి కోసం హైదరాబా

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత

ఆలోచింపజేస్తున్న 'వోట్ టీడీపీ-సేవ్ ఆంధ్రా' క్యాంపెయిన్

ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడి టీడీపీని మళ్లీ ప్రజలకు చేరువ చేసేలా సరికొత్త వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ప్రచార బాధ్యతలను తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయవాది, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త దుర్గా స్థపతి ఆచార్యకు అప్పగించారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ ఈ ప్రచార బాధ్యతలను తమకు అప్పగించారని దుర్గాస్థపతి ఆచార్య చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఇప్పటికే బాగా అర్థం చేసుకున్న తాము.. అందులో భాగంగానే అద్భుతమైన ఫలితాలు రాబట్టే దిశగా సృజనాత్మకమైన రీతిలో నినాదాలు రూపొందించి కార్యక్షేత్రంలోకి వెళ్తున్నామని స్థపతి చెప్పారు. అదే పద్ధతిలో కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు.  టీడీపీ కోసం తమ క్యాంపెయిన్ ఎలా ఉంటుందో ఇకపై చూస్తారని.. తమ విజన్ కు, సృజనాత్మకమైన పనితీరును బాగా అర్థం చేసుకోవడం వల్లే ఎంతో నమ్మకంతో తమకు ఈ కీలకమైన బాధ్యతలు టీడీపీ నేతలు అప్పగించారని స్థపతి చెప్పారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?