Skip to main content

Posts

వామ్మో! కరోనా టెస్టుల కోసం ఇంత పెద్ద క్యూనా?

కరోనా పాజిటివ్ కేసులు రోజుకు దాదాపు వెయ్యికి చేరుకోవడంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వం సీరియస్ గా చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఇలా ఉంటే అసలు టెస్టుల కోసం ఎంత మంది క్యూలో ఉన్నారో చూస్తే జడుసుకోవాల్సిందే. సికింద్రాబాద్, తిరుమలగిరిలో విజయా డయాగ్నొస్టిక్స్ ముందు టెస్టుల కోసం ఎంత మంది లైన్ కట్టారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.  అంతేకాదు.. అసలు అనుమానంతో క్యూలో ఉన్నవారి సంగతలా ఉంచితే.. క్యూలో ఉన్నవారికే కరోనా ఉంటే అది లేనివారికి కూడా సోకే పరిస్థితి దాపురించింది. ఎవరు దీన్ని ఆపాలి.. ఎలా ఆపాలి... ఎక్కడ బ్రేక్ పడుతుందో ఆ దేవుడికే తెలియాలని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

కరోనా కొమ్ములు విరిచే కిల్లర్- వీడియో

భారతీయ ఆయుర్వేదం అనే అమ్ములపొదిలో గాండీవాల్లాంటి అనేక చిట్కాలున్నాయి. అందులో ఒకటే పసుపుకొమ్ముల ఆవిరి. పసుపుకొమ్ముల ఆవిరి ఎలా చేయాలంటే.. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో తగినన్ని పసుపుకొమ్ములు వేసి బాగా మరిగించాలి. ఆ ఆవిరిని బాగా పట్టాలి. కరోనా రాకుండా నిరోధించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.  ఆవిరి పట్టడం ఇలా.. ఆవిరి పట్టడంలోనే మనకు మంచి రిలీఫ్ వస్తుంది. ముక్కునుండి పీల్చుకొని నోటిద్వారా 3 సార్లు, నోటి నుంచి పీల్చుకొని ముక్కుద్వారా 3 సార్లు.. ఇలా మార్చి మార్చి ఒక పదిసార్లు పడితే యాంటీ బ్యాక్టీరియాతో కూడిన వేడిఆవిరి ఊపిరితిత్తుల్లోకి, ముక్కు నాళాలు, శ్వాసకోశ నాళాల గుండా వెళ్తుంది. ఆవిరి వేడికి కరోనా వైరస్ చనిపోతుంది. వాస్తవానికి కరోనా అనేది వైరస్ కూడా కాదని, అది కేవలం ప్రొటీన్ మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది సింగిల్ గా ఉన్నప్పుడు నిర్జీవం.. ఏమీ చేయదు. ఆ వైరస్ కాస్తా మన చేతుల నుంచి ముక్కు, నోరు, కళ్లు.. ఇలాంటి అవయవాల ద్వారా లోపలికి వెళ్తే అది శ్వాసకోశ నాళాలు లేదా ఆహారవాహిక ద్వారా గోడలకు అంటుకుంటుంది. దానికుండే కొమ్ముల కారణంగా అది ఆ గోడలకు పట్టుకుని

బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో

ప్రాణం విడుస్తూ ఓ యువకుడు తీసిన వీడియో తెలుగు మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న యువకుడికి అకస్మాత్తుగా వెంటిలేటర్ తీసేశారని స్వయంగా బాధితుడే సెల్ఫీ వీడియో తీసుకొని తండ్రిని ఉద్దేశించి చివరిమాటలు మాట్లాడటం రాష్ట్రంలో కరోనా భయంకర రూపం దాలుస్తున్న విషయాన్ని కళ్లకు కట్టింది. డాడీ.. నాకు ఊపిరాడ్తలేదు డాడీ.. వద్దనంగా వెంటిలేటర్ తీసిండ్రు. మూడు గంటలైతంది డాడీ.. నా గుండె ఆగిపోయింది. కిడ్నీ ఫెయిలైంది. ఊపిరొక్కటే ఆడ్తంది.. ఇప్పుడు అది గూడ అయిపోయింది డాడీ.. బాయ్ డాడీ.. బాయ్. ఇవీ ఆ యువకుడి చివరి మాటలు.  కరోనా ఉధృతిని, దాని వ్యాప్తిని అత్యంత ముందుచూపున్న నేతలుగా పేరున్నవారు కూడా అంచనా వేయలేకపోయారు అనడానికి ఇది మరో నిదర్శనం. మొన్న 28 ఏళ్ల యువ జర్నలిస్టు మనోజ్ గాంధీలో చికిత్స సరిగా అందక చనిపోవడం మరుపునకు రాకముందే మరో నవయువకుడు కరోనా కోరలకు చూస్తూ చూస్తూ బలైపోవడం ప్రజలకు జీర్ణం కాని విషయం. కరోనా అనేది తెలంగాణకు రమ్మన్నా రాదు.. నీ దండం బెడ్తా రావే అంటె గూడ రాదు.. అన్న మాటల్ని ఓసారి మననం చేసుకుంటే మన నేతలు కరోనా విషయంలో ఎ

రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం అన్నారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఒత్తిడే ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలని రేవంత్ సూచించారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎగ

మూడు, నాలుగు రోజుల్లో కరోనా వ్యూహం ఖరారు-కేసీఆర్

జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజులపాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. Also Read: బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో వైద్యఆరోగ్య శాఖ

పీవీని స్మరించుకున్న తెలంగాణ జనత

  భారతదేశానికి ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఓ మారుమూల గ్రామంలో పుడతాడని, అందులోనూ భారత ప్రధాని వంటి అత్యున్నత పదవికి పోటీపడే ఉత్తరభారతంలోని ఉన్నతమైన కుటుంబాల రాజకీయ పోటీని తట్టుకొని.. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని కాబోయే వ్యక్తి పుడతాడని ఎవరైనా ఊహించగలరా? కానీ పాములపర్తి వేంకట నరసింహారావు అలియాస్ పీవీ నరసింహారావు విషయంలో అది నిజమైంది. ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే పీవీ రాజనీతి దేశంలోనే కాదు.. ఖండాంతరాలు కూడా వ్యాపించింది. ఎందుకంటే.. ఆయనకు అంత ఖ్యాతి వ్యక్తిగతమైన స్వచ్ఛత, సౌశీల్యతల వల్ల వచ్చింది కాదు. దేశ ప్రజలు మెచ్చిన పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల వల్ల వచ్చింది. రాజకీయ చాణిక్యుడు... భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ప్రాంతం ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం అనే సిద్ధాంతంతో పాలన సాగించిన రాజనీతికోవిదుడు.. తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది పట్టాలెక్కించిన ప్రధాని ఆయన. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలపాటు విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించిన ప్రధాని కూడా ఆయనే.  వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి,  సీతారామారావు

ఓ కోతిని కొట్టి చంపి, మరో కోతిని ఉరేసి.. వైరల్ వీడియో

  ప్రకృతి మీదనే ఆధారపడి బతుకుతున్న మనిషి.. ఆ ప్రకృతి వైవిధ్యాన్ని మాత్రం కాపాడటం లేదు. పైగా మూగజీవాల పాలిట రాక్షసుడిగా మారుతున్నాడు. కరోనా వంటి మహమ్మారి మానవాళిని శాసిస్తున్నా కూడా ఇతర ప్రాణుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. మానవత్వం మరచి అడవి జంతువుల  కన్నా హీనంగా వ్యవహరిస్తున్నాడు.  ఖమ్మం జిల్లా జిల్లా వేంసూర్ మండలంలో మానవ సమాజం అసహ్యించుకునేలా ఓ కోతిని ఉరేసి చంపారు కొందరు ప్రబుద్ధులు. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యం చక్కర్లు కొడుతున్నా కూడా సంబందిత అటవీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.పైగా ఇదేంటని ప్రశ్నించినవారికి దురుసుగా సమాధానం ఇస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది.  సాధు వెంకటేశ్వరావు, పాస్టర్ జోసెఫ్ రాజ్ ఇళ్ళ సమీపంలో ఓ నీటి తొట్టిలో వానరం పడిపోయి కొట్టుమిట్టాడుతోంది. మానవతా దృక్పథంతో కోతిని కాపాడాల్సిన వారిద్దరూ వానారాన్ని కర్రలతో కొట్టి చంపి బయట పడేశారు. చనిపోయిన వానరం వద్దకు మరికొన్ని కోతులు రావటంతో జోసెఫ్ రాజ్, వేంకటేశ్వరావు మరో కోతిని పట్టుకుని సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసి కుక్కలతో కరిపిస్తు హతమార్చారు