Skip to main content

Posts

వార్త రాస్తే ఇల్లు కూల్చాలా?

  ఓ గ్రామీణ విలేకరి ఇల్లు కూలింది. పెను దుమారానికో, విపరీతమైన వర్షానికో, లేక  శిథిలావస్తకు చేరుకునో ఆ ఇల్లు కూలలేదు. ఇంకా ఆకృతి  దాల్చని ఆడశిశువు పీక పిసికేసినట్టు ఇప్పుడే పునాదులు పూర్తి  చేసుకొని గోడల దశకు చేరుకున్న ఇల్లు నేలమట్టమైంది. పిల్లాడు ఐస్ క్రీమ్ చీకినంత ఈజీగా ఒక ఎమ్మెల్యే పంపిన మనిషి బుల్డోజర్ మీద వచ్చి ఆ విలేకరి ఇంటిని పునాదులకంటా నేలకు నాకించేశాడు. వార్త రాసి, అది కాస్త డెస్క్ లో ఊపిరి పోసుకొని శాటిలైట్ గుండా ప్రపంచాన్ని పలకరించేసరికి విలేకరికి చాలా సంతృప్తే కలిగి ఉండొచ్చు. ఎందుకంటే.. ఆ వార్త ఏ గల్లీ లీడర్ మీదనో రాసింది కాదు కాబట్టి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో కోవిడ్ నిబంధనలు గాలికొదిలేశారని, దాదాపు 200 మందికి పైగానే పార్టీకి హాజరై.. ఎవరూ మాస్కులు ధరించలేదని, సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, ఓ నాయకుడే ఇలా కోవిడ్ రూల్స్ కి పాతరేస్తే మరి రూల్స్ ఎందుకు? నాలుక గీసుకోవడానికా ? అన్న నికార్సిన ఆవేదనతో పరమేశ్ అనే వీ6 విలేకరి ఓ వార్తను ఫైల్ చేశాడు. ఆ వార్త కాస్తా ప్లే అయింది. ఎమ్మెల్యే ఇంటికి 200 మంది బంధుమిత్రులు, వెంట ఉండే అనుచరగణం హాజరైనా పోని పరువు

మతోన్మాదం పేదవారికి ప్రథమ శత్రువు

  ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. ఆధ్యాత్మికతలో మనిషి తనను తాను పరిశీలించుకుని ఆత్మ దర్శనం కొరకు సాధన చేసి పరమాత్మను గురించి పరమాత్మ సంకల్పానుసారం సాధనలో ముందుకు వెళ్తాడు. ఆత్మ జ్ఞానానికి ఏ మతంతో, కులంతో సంబంధం లేదు. ఋషులు, మునులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శిరిడి సాయిబాబా, బ్రహ్మంగారు ఈ కోవలోకి చెందినవారు. వాస్తవం చెప్పాలంటే మన దేశంలో హిందూ మతం, హిందూ జాతి అనే పదాలను అర్థం తెలియకుండా వాడుతున్నారు. వేదాలలో భగవద్గీతలో హిందూ మతం అనే పదం లేదు. భరతజాతి అని కొన్ని చోట్ల ఉంది. మన దేశంలో కొందరు విష్ణు భక్తులు, వైష్ణవులు, కొందరు శివ భక్తులు, శైవులు కొందరు అద్వైతాన్ని మరికొందరు ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తారు. యజ్ఞాలలో జంతుబలిని హింసను వ్యతిరేకించి కరుణారస హృదయంతో బౌద్ధం వచ్చింది. శంకరుని మాయ వాదమైనా బౌద్ధంలోని నిరంతరం మారే ప్రపంచమన్న వాస్తవంగా ఒకే విషయాన్ని చెప్తున్నది.   యోగులు అందరూ అద్భుతమైన అనుభవాలు కలవారే. ఇహలోక సుఖాలను కాదని పరమాత్మ సన్నిధానానికై ప్రయత్నించినవారు అన్ని మతాల్లో ఉన్నారు. జైనులు, సిక్కులు, ఆర్య సమాజం వారు ఇలా ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. వాస్తవంగా ఒక మతం, ఒక జాతి అంట

బతికున్నప్పుడు అవమానించి చచ్చాక ఆదుకుంటారా?

Photo Credit: Business Standard ప్రపంచవ్యాప్తంగా కరోనా మీద వెనుకంజ వేయని రీతిలో యుద్ధం కొనసాగిస్తున్న దేశంగా మన దేశానికి ఒక మంచి పేరు వచ్చింది. అయితే అదే కరోనా మీద యుద్ధంలో రాజీపడటంతో ప్రభుత్వానికి వచ్చిన ఆ మంచిపేరు కూడా నెగెటివ్ గా మారిపోతోంది. ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కరోనా మీద ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతుండడం విశేషం. మరోవైపు కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి కాలే కడుపులతో కాలి నడకన వందలు, వేల కిలోమీటర్ల దూరం వెళ్తున్న వలస కూలీలకు ఇప్పటివరకు కేంద్రం వైపు నుంచి చెప్పుకోదగ్గ ఆసరా అందకపోవడం ఆశ్చర్యం గొలుపుతున్న అంశం.  ఈ దేశ ప్రగతి చక్రానికి ఇరుసులా పనిచేసిన వలస కూలీలకు, తమ శ్రమతో, చెమట చుక్కలతో ఉన్నత కుటుంబాలకు ఇంద్ర భవనాలు నిర్మించి ఇచ్చిన అనామక శ్రామికులకు కనీసం లాక్ డౌన్ సమయంలోనైనా రెండు పూటలా నాలుగు ముద్దలు అందించలేకపోయింది మన దేశం. వాళ్ల పూట గడిస్తేనే పెద్దోళ్ల ఏసీలు తిరుగుతాయి. వాళ్ల చెమట చుక్కలు రాలితేనే ఖరీదైన విల్లాలు, రియల్ బిజినెస్ లు స్టాక్ మార్కెట్ తెరల మీద రివ్వుమంటూ దూసుకుపోతాయి. ఏ ఒక్క కార్పొరేట్ బిజినెస్ పేజీలో కూడా వారి కోసం కాసింత చోటు దక్కని సేవామూర్తులక

కరోనా - ఓ కవి శత కంద పద్య ప్రహేళిక

కవుల మస్తిష్కాల్లోని భావ ప్రపంచం కదిలితే ఏ  రసమైనా ఏరులై పారాల్సిందే. ఆనందమైనా, అద్భుతమైనా, బీభత్సమైనా, కారుణ్యమైనా.. ఆఖరుకు ఇప్పటి కరోనా విసురుతున్న అదృశ్య ఖడ్గ విచలిత విషాదమైనా.. అది ఏ రసమైనా కానీ.. కాలువలు కట్టి ప్రవహింపజేయగలడు కవి. ఆ రస ప్రవాహంలో పఠితలను అలవోకగా తేలియాడించగలడు. భావానందంలో ముంచి బ్రహ్మానంద సీమల మేరువుల వైపు కొనిపోగలడు. అందుకే కవి మనసు పడితే కావ్యకన్యక అందాలు కందాలై పూల తేనియల మకరందాలై కస్తూరికా కదంబాలై కట్టిపడేస్తాయి. అదే జరిగింది ఇక్కడ. సుధాశ్రీ పేరుతో బస్వోజు సుధాకరాచారి కరోనా ప్రస్థానాన్ని, దాని ప్రయాణంలో విశృంఖలత్వాన్ని, సాంస్కృతికంగా అది మోసుకొస్తున్న చైతన్య వీచికలను కందపద్యాల్లో వ్యక్తపరిచారు.    కందం రాయగలవాడే కవి అన్న నానుడిని బట్టి తెలుగు సాహితీ లోకంలో కందానికి ఉన్న కాఠిన్యత, సంక్లిష్టత, విశిష్టతలు ఎలాంటివో గ్రహించవచ్చు. అలాంటి కఠినమైన సాహితీ ప్రక్రియను ఎంచుకొని శతాధిక పద్యాలతో కూడిన అమృత కలశాన్ని సాహితీ ప్రియులకు అందిస్తున్నారు. అయితే కందం రాసేవారికే కష్టం గానీ.. చదువరులకు చాలా తేలిక. అందుకే తెలుగునాట ప్రాచీన కవులు ఈ ప్రక్రియనే ఎక్కువగా ఎంచుకున్నారు. అదే బ

కైలాసనాథుడి చెంతకు ఇకపై రోడ్డు మీదుగా..

హిమాలయాల్లోని మానసరోవరానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన ముందడుగు వేసింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ వద్ద లింక్ రోడ్డు వేయడంతో కైలాస మానసరోవరానికి మరింత సులభంగా వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది. ఈ చర్యతో టూరిస్టులకు ఢిల్లీ నుంచి మానసరోవారం అత్యంత సమీపానికి నేరుగా బస్సులోనే వెళ్లే అవకాశం ఏర్పడింది. ప్రతి సంవత్సరం మానసరోవరానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుమతిస్తారు. ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ లింక్ రోడ్డు ద్వారా టిబెట్ భూభాగంలో ఉన్న మానసరోవరాన్ని నేరుగా సందర్శించవచ్చు. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో హిందువులు పోటీపడుతుంటారు.  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పూర్తయిన ఈ రోడ్డు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. లిపులేఖ్ పాస్ నుంచి మానసరోవరం 90 కి.మీ. దూరంలో ఉంటుంది. రోడ్డుమార్గం ప్రారంభంలో రాజ్ నాథ్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మానసరోవరానికి మొదటి జట్టు భక్తుల యాత్రకు రాజ్ నా

మీ ఇంటి ముందుకే లిక్కర్ బాటిల్

నువ్వు నా దగ్గరకు వస్తే సమస్య గానీ.. నేనే నీ దగ్గరకు వస్తే సమస్యే ఉండదు కదా అంటోంది లిక్కర్ బాటిల్. మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు సందర్భంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో వైన్ షాపులు తెరుచుకున్నాయి. వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల భారీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్  డిస్టెన్స్ పాటించడం అనేది ఓ పెద్ద సవాలుగా మారింది. మందు  చుక్క కోసం గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయడం, మందుకోసం ఒకరినొకరు తోసుకోవడం, అటు ప్రభుత్వాల దగ్గర కూడా డిమాండ్ కు తగ్గట్టుగా ఎలా నిర్వహంచాలో ప్లానింగ్ లేకపోవడంతో.. ఈ రంగంలోకి ఫుడ్ డెలివరీ సంస్థలు అడుగు పెడుతున్నాయి. ప్రభుత్వాలు చేయలేని పని మేం చేస్తామంటూ కొత్త వ్యాపార సూత్రాలతో ముందుకొస్తున్నాయి.  వినియోగదారులకు హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి టిఫిన్, మీల్స్ డెలివరీ చేసే జొమాటో ఇకనుంచి లిక్కర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కు ముుందు ఫుడ్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉండే జొమాటో.. లాక్ డౌన్ తరువాత దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో డెలివరీ బాయ్స్ కు ఉపాధి లేకుండాపోయింది. చాలా వ్యాపార సంస్థల్లాగే జొమ

వీళ్లను ఆదుకోవాల్సింది కేసీఆరే-కె.సి.కాళప్ప

కరోనా దెబ్బకు దాదాపు 2 నెలలుగా ఉపాధి కోల్పోయి, కూలీ పని కూడా దొరక్క పేదల కుటుంబాలన్నీ అల్లకల్లోలంగా మారుతున్న క్రమంలో అత్యంత వెనుకబడ్డ వర్గాలను ఆపద్బాంధవుడైన ముఖ్యమంత్రి కేసీఆరే ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.సి.కాళప్ప విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో రెక్కాడినప్పుడే పూర్తిగా డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఎంబీసీలు.. కరోనా దెబ్బకు కనీసం ఆకలి కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటివారి కోసం ప్రత్యేకంగా ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉందని కాళప్ప అభిప్రాయపడ్డారు. కుప్పకూలిన చేతివృత్తులు చేతివృత్తులు, మానవసేవలు అందించే బడుగులు, నిరుపేదలంతా మోస్ట్ బ్యాక్ వార్డ్ కులాల్లోనే ఉన్నారని.. వారిని కాపాడుకోవడం యావత్ సమాజ కర్తవ్యమన్న ఆయన.. అలాంటివారిని కాపాడుకోకపోతే వారి సేవలమీదనే ఆధారపడ్డ అనేక కుటుంబాల పరిస్థితి సంకటంలో పడుతుందన్నారు. హైదరాబాద్ లో నిర్మాణరంగానికి అవసరమైన కూలీలుగానీ, హమాలీలు గానీ, పరిశ్రమల్లో పనిచేసే వర్కర్లు గానీ, అడ్డా మీది లేబర్లు గానీ, ఆఫీసులు-కార్యాలయాలకు వెళ్లే ఉన్నత కుటుంబాల ఇళ్లలో పనిచేసే పనిమనుషులు,