Skip to main content

Posts

సింగరేణి ఏరియా ఎమ్మెల్యేల్లో గుబులు

వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు...కానీ నియోజక వర్గాల్లోకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు ఇబ్బందిగా మారిందని ఆ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇంతకీ ఇబ్బందులు పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు... ఏ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వారు గుర్రుగా ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం తమకు ఇబ్బందులు తెస్తున్నాయని వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు ఉండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ...ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసి యూనియన్ ఆఫీసులకు తాళాలు వేయడంతో ఆ ప్రభావం తమపైన పడిందంటున్నారు గులాబీ పార్టీ  ఎమ్మెల్యేలు. అంతేకాదు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని భయపడుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, రామగుండం, భూపాల పల్లి, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహిస్తే బాగుండని అనుకుంటున్నారు.

అఖిలప్రియపై సొంత తమ్ముడు కోర్టుకెక్కడంలో అసలు కారణం ఇదే

భూమా అఖిలప్రియ మరో వివాదంలో  చిక్కుకున్నారా......ఆస్తికోసం సొంత తమ్ముడు .....సోదరిపైనే కోర్టుకెక్కాడా..... ఎప్పుడో 2016 లో  తండ్రి విక్రయించిన స్థలంపై  వాటా కోసం అఖిలప్రియ తమ్ముడు ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించినట్టు....ఒకవేళ నిజంగా  ఆస్తికోసం  అక్కపై  కోర్టుకెక్కితే ఆమె ఇంట్లోనే ఎందుకు ఉంటారు.... ఆమె కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ఎందుకు వెళతారు........దీని వెనుక ఎదైనా  హిడెన్ అజెండా  ఉందా....... అక్కపై తమ్ముడు  నిజంగా   కేసు పెట్టారా.... లేక ఫ్యామిలీ డ్రామానా?  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద ఆమె సోదరుడు కోర్టుకు వెళ్లారు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమా కుటుంబానికి హైదరాబాద్ శివారు గండిపేట వద్ద 1000 గజాల స్థలం ఉంది. అయితే, ఆ ఆస్తిని 2016లో విక్రయించారు. ఆ సమయంలో తాను మైనర్ అని తన తండ్రి భూమా నాగిరెడ్డి చెప్పడంతో వేలిముద్రలు వేశానని జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నాడు. అప్పట్లో సుమారు రూ.2కోట్లకు ఆ భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, మూడేళ్ల నాడు అమ్మిన ఆస్తిలో తనకు వాటా కావాలంటూ జగన్ విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు కోర్టును ఆశ్రయ

ఆంధ్రాలో కాపులకు బీజేపీ ఎందుకు గాలం వేస్తోంది?

ఆంధ్రప్రదేశ్ లో సీఎం పదవిని కాపులు ఎందుకు అందుకోలేకపోతున్నారు? అంతటి సమర్ధులు లేరా? ఆర్థికంగా స్థితిమంతులు కారా? వంగవీటి రంగా, దాసరి నారాయణ రావు, కన్నా లక్ష్మీ నారాయణ, చిరంజీవి, ముద్రగడ పద్మనాభం సీఎం అయ్యే అర్హతలు ఉన్నా ఆ పదవిని ఎందుకు అందుకోలేకపోయారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గం నుంచి ఇపుడు సీఎం రేసులో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రాలో కాపులకు ఉన్న అడ్వాంటేజెస్ డిజాడ్వంటేజెస్ ఏమున్నాయో ఓసారి చూద్దాం.  తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవి కాపులకు అందని ద్రాక్షలానే మిగిలింది. కాపు సామాజికవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నా....సీఎం పదవిని మాత్రం అందుకోలేకపోవడంతో  వారు తీవ్ర నిరాశా నిస్ప్రుహలకు గురవతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్,  బీజేపీలలో కాంగ్రెస్ పార్టీ గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. అయితే బీజేపీ మాత్రం దక్షిణాది రాష్ట్రాలలో తన ముద్ర వేయలేకపోతోంది. ప్రాంతీయ పార్టీల పొత్తులతో అరకొర సీట్లు సాధిస్తోంది. ఒక్క కర్ణాటకలోనే అధికారం దక్కించుకోగలిగింది. 2014 నుంచి ఉత్తరాదిలో తిరుగులేని శక్తి

తెలంగాణ ఖజానా ఖాళీ.. కారణాలు ఇవే

రైతు బంధు పథకం రెండో దఫాకు  నిధులు లేవా...నవంబర్ నెల సగం గడిచినా ఈ పథకంపై  ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు...... ఖజానా నిండుకుందా.... ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి  పథకంలో మార్పులు చేసి పది ఎకరాల పరిమితి  విధించబోతున్నారా.....రైతు బంధు నిధుల విడుదల ఆలస్యంపై ప్రత్యేక కథనం... తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతుబంధు పథకానికి నిధుల కొరత ఏర్పడిందని సమాచారం..ఇంతవరకు రెండో దఫా నిధుల విడుదల పై ప్రభుత్వంలో కదలికే లేదు.ఈ పథకం మొదటి విడతను మే, జూన్ నెలలో, రెండో విడతను అక్టోబర్, నవంబర్ లలో విడుదల చేస్తామని ప్రకటించారు..అయితే మొదటి దఫా నిధులే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు.హుజుర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో సూర్యాపేట జిల్లాలో పెండింగులో ఉన్న నిధులు ఒకేసారి విడుదల చేశారు. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.ఒక విడత రైతుబంధు కు ఆరు వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల కోట్లే విడుదలయ్యాయి... నిధుల కొరత కారణంగా ఒకేసారి ఇవ్వలేక దశల వారిగా విడుదల చేస్తున్నారు..మరో ఐదు వందల కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది.   మొదటి దఫా పూర్తి కాకుండానే రెండో విడత సమయం వచ్చింది.గత ఏడాది ముందస్తు అసెంబ్లీ ఎన్న

ఆ రాష్ట్రంలో ఆ కులం వర్సెస్ ఈ కులం

రాజకీయాలంటే కులాల పోరాటమా? విభిన్న వర్గాల మధ్య సమరమా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏం జరిగింది? అంతకుముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కులాలకు రాజకీయ ప్రాధాన్యత లభించింది? ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న జగన్ ఏ వర్గాలకు కొమ్ము కాస్తున్నాడు? తాజాగా రోజా చేసిన అతిశయింపు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.    రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.   అవి కదిలే ప్రవాహంలా సాగిపోతుంటాయి. ఈ నిముషానికి సుఖం అనుకుంటే మరు నిముషంలో పెద్ద సంక్షోభం పుడుతుంది. సాగరంలో బడబాగ్ని దాగున్నట్లుగా బయటకు వచ్చి ఎపుడు ఎగిసి పడతాయో తెలియదు.  ఈ నిమిషానికి ఉన్న రాజకీయాలు మరునిమిషం మారిపోగలవు. అందుకే రాజకీయాలు హ్యాపీ అని ఎవరూ తీరిగ్గా కూర్చోవడానికి వీల్లేదు. కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఏపీ రాజకీయాల్లో  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత ప్రభుత్వం రెడ్లను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేసిందని రోజా గతాన్ని తవ్వారు. అంతేకాదు గత ప్రభుత్వం రెడ్లను అవమానాలను గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయాల్లో ఎదగనీయలేదని ఆరోపించారు. అలాంటి ప్రభుత

ఆలయం అంటే ఏమిటో ఎందరికి తెలుసు?

  దేవుణ్ని నమ్మేవాళ్లు అందరూ ప్రతిరోజూ కాకపోయినా సందర్భానుసారమైనా ఆలయ దర్శనం, దైవ దర్శనం చేసుకుంటారు. అయితే గర్భగుడి అనే మాట గురించి అందరికీ తెలిసిదే. అసలు గర్భగుడి అంటే ఏమిటనేది చాలా మందికి తెలియదు. గర్భగుడి అనగానే విగ్రహాన్ని రక్షిస్తూ నాలుగు వైపులా గోడలు ఉండడం.. పైనేమో ఊర్వం.. అంటే విమానం గుర్తుకు వస్తుంది. విగ్రహ రూపంలో భగవంతుడు నెలకొని ఉన్న చోటే గర్భగుడి అని కొందరు.. గుడి గర్భం.. అంటే మధ్యభాగంలో భగవంతుడుంటాడు కాబట్టి గర్భగుడి అని మరికొందరు భావిస్తారు. అయితే ఆ గుడిగర్భంలో లేదా.. గర్భగుడిలో ఏముంటుంది? ఈ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చిందనేది చాలా మందికి తెలియదు. అదే ఇప్పుడు తెలుసుకుందాం.    ఆగమ,శిల్పశాస్త్రాల్లో గర్భగుడిని.. ప్రాసాదం, సందనం,ధామం, నికేతనం, మందిరం, సౌధం, ఆలయం, నీలయం, ఆయతనం అనే పేర్లతో పిలుస్తారు. అవే గాక దాదాపు ఇంకా ముప్పైకి పైగా పేర్లున్నాయి. అదొక విశేషం. అయితే ప్రాచీనకాలంలో ఆలయాన్ని నిర్మించే ముందు ఆ ప్రదేశంలో గర్పన్యాసం అనే ప్రక్రియ నిర్వహించేవారు. ఒక రాగి కలశం తీసుకొని అందులో నవరత్నాలనూ, పంచలోహాలనూ, ఇంకా కొన్ని ధాతువులను, కొన్ని ఔషధమూలికలనూ ఉంచి పూజాదికాలు నిర్వహించి...

జగన్ ను, కేసీఆర్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తులు

మఠాధిపతులు, పీఠాధిపతులు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారన్నది రాచరిక వ్యవస్థలో రాజ్యమేలిన సంగతి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న నేటి వ్యవస్థలో కూడా ఆనాటి పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వ్యవస్థకు మంచిదా? కాదా? మంచి,చెడుల ప్రభావం పాజిటివ్ గా కనిపిస్తోందా, నెగెటివ్ గానా? అన్న విషయాన్ని వివరించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.  తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో స్వామీజీలే చక్రం తిప్పుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టకపోయినా... పాలకుల ప్రతీ అడుగులో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు రాజగురువులు పోషించిన పాత్రను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పీఠాధిపతులే నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య సయోధ్య నుంచి నదీ జలాల పంపిణీ వరకు ఎన్నో కీలక నిర్ణయాల వెనుక పీఠాధిపతుల చొరవ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలున్న రాష్ట్రాల మధ్య కూడా లేని సఖ్యత, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఉందంటే... ఆ క్రెడిట్ తప్పకుండా పీఠాధిపతులకే దక్కుతుంది.  రాజరిక వ్యవస్థలో చక్రవర్తుల కీలక నిర్ణయాల్లో నాటి రాజగురువుల పాత్ర అద్భుతమైనది. నాడు రాజగురువుల దిశానిర్ధేశం వల్లనే సుభీక్షమైన పాలన చేపట్టగ