Skip to main content

Posts

Showing posts with the label TELANGANA

రేపటి ఉద్యమానికి నేటి నుంచే సిద్ధం కావాలి: చెల్లోజు రాజు

ఉపాధి దెబ్బతిని, కుటుంబాలు అల్లకల్లోలమవుతున్న తరుణంలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని, ప్రభుత్వాలు తమవైపు దృష్టి సారించేదాకానైనా తమ జాతిలో ఔదార్యం గలవారు ముందుకు రావాలని, వృత్తిపనులకు దూరమైన పేద విశ్వబ్రాహ్మల్ని ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పలు పేద కుటుంబాలకు విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించినట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ఆదేశాల మేరకు, కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ఇల్లంతకుంటలో సమావేశం నిర్వహించామని, ఈ సమావేశానికి మండల విశ్వబ్రాహ్మల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.  తమ జాతి ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్నారని, తెలంగాణ వచ్చిన తరువాత అనేక కులాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నా.. విశ్వబ్రాహ్మలు మాత్రం వివక్షకు గురవుతున్నారన్నారు. ఎందరో విశ్వబ్రాహ్మణ సోదరులు ఆత్మహత్యలకు పాల్పడ్డా వారి కుటుంబాలకు కనీస పరామర్శ సైతం దక్కడం లేదన్నారు. మరోవైపు ఇప్పటివరకు తమ జాతిలో అనేక సంఘాలు ఉనికిలో ఉండేవన

మన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయమిదే

భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు.  ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం? శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవకాశాన్ని కూడా లేకుండా చేసేదాన్ని శాస్త్రీయ వైద్యంగా పిలిచేవారి అజ్ఞానానికి

భక్తిశ్రద్ధలతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు (చిత్రమాలిక)

ప్రొఫెసర్ తియ్యబిండి కామేశ్వరరావు స్వగృహంలో తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. గతేడాది లాగే ఈసారి కూడా  కరోనా విజృంభించిన తరుణంలో వీరగురుడి ఆరాధనోత్సవాలను సాదాసీదాగా, నిష్టగా జరుపుకున్నారు. కాలజ్ఞాన ప్రదాత అయిన వీరబ్రహ్మేంద్రస్వామి 327 ఏళ్ల క్రితం కందిమల్లాయపల్లిలో జీవసమాధిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులు ఎక్కడికక్కడ స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించుకున్నారు. పలుచోట్ల జరిగిన ఈ ఆరాధనోత్సవాలకు సకల వర్గాల ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.  ఇక విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ  ఐక్య సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం తానాజీనగర్ ఉప్పుగూడలో నిర్వహించారు. ఆ సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బండ్లగూడ మండలాధ్యక్షులు తోట శ్రీనివాసాచారి, బహదూర్ పురా మండలాధ్యక్షుడు వలబోజు రవికిరణ్, సైదాబాద్ మండలాధ్యక్షుడు వోరువాళ్ళ వీరేష్, మేడిపల్లి వెంకటేశంచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వకర్మ భ

కరోనా కాటేసిన వేళ చిన్ననాటి మిత్రులే ఆప్త బంధువులు

కరోనా కాటేసిన వేళ చిన్ననాటి మిత్రులే ఆప్త బంధువులు అయ్యారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం మారేడుపాక కు చెందిన పాడి మహేందర్ రెడ్డి 10రోజుల క్రితం కరోనాతో చనిపోయారు. చాలా చిన్న వయసులోనే  మహేందర్ రెడ్డి చనిపోవడంతో కుటుంబం కష్టాలపాలైంది. దీంతో చిన్ననాటి మిత్రులందరూ కలిసి వారి కుటుంబానికి 50 వేల రూపాయలు  ఆర్థిక సహాయం చేశారు. ఆ చెక్కును మహేందర్ రెడ్డి భార్య కు అందించారు.  ఈ కార్యక్రమంలో ఇనుగంటి రామారావు, నాగభూషణాచారి, చారి, ఇనుగంటి శ్రవణ్ కుమార్, తిరుపతి యాదవ్, రాజమౌళి, నర్సింహాచారి, నాగరాజు, శ్యామ్, మిగతా మిత్ర బృందం పాల్గొన్నారు.

ఈటలతో జతకట్టిన ఏనుగు రవీందర్ రెడ్డి

హరీష్ రావు ఆత్మీయ సహచరుడు రవీందర్ ఉత్తర తెలంగాణలో సీనియర్ టిఆరెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరుగుబాటు నేత ఈటెల రాజేందర్ తో జతకట్టనున్నారు..గురువారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి నేరుగా ఈటెలను కలిసి సంఘీభావం ప్రకటించారు..  ఈ పరిణామం టిఆరెస్ లో  సంచలనం సృష్టిస్తోంది.. మంత్రి హరీష్ రావు కు అత్యంత నమ్మకమైన రాజకీయ సహచరుడిగా మెదులుతున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెలను కలవడం రాజకీయ ప్రకంపనలకు దా రితీయబోతోంది..2004 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన రవీందర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు..15 ఏళ్ళ పదవీ కాలంలో హరీష్ రావు వెంటే నీడలా ఉన్నారు..పొద్దున్నుండి రాత్రి వరకు హరీష్ వెంటే ఉండేవారు..2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ చేతిలో ఓడిపోయినప్పటికి…హరీష్ రావు తో బంధం వీడలేదు.. కొద్దికాలానికే కాంగ్రెస్ నుంచి సురేందర్ కారెక్కడంతో సిట్టింగ్ హోదాలో ఉన్న జాజులను కాదనే పరిస్థితి లేకుండా పోయింది హరీష్ రావు కు..అయినా రవీందర్ రెడ్డి తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు హరీష్ రావు..సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్,త

జర్నలిస్టుల కుటుంబాలకు చేయూతనిద్దాం-జైన్ కుమార్ విశ్వకర్మ

వార్తల కవరేజీ విషయంలో కరోనా మహమ్మారికి ఎదురీదుతూ పనిచేస్తున్న జర్నలిస్టులను గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జైన్ కుమార్ విశ్వకర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది కాలంగా కరోనా విజృంభణకు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన తరుణంలో మీడియా సంస్థలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ఆదుకునే విషయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిన అంశమని జైన్ అన్నారు. అదే స్ఫూర్తితో స్థానిక ప్రభుత్వాలు కూడా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు వర్తింపజేసి జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి తనవంతుగా ఒక నెలకు సరిపడా సరుకులు అందజేశామని, జర్నలిస్టులకు చేయూతనందించే విషయంలో అన్ని సామాజికవర్గాలవారూ ముందుకు రావాలని జైన్ పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు టి.రమేశ్ బాబు కు ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ తరఫున ఈ సరుకులు అందజేశామని, ఇతర ప్రాంతాల్లోని బాధ్యులు కూడా ఎక్కడి

ఈటల ప్లేస్ లో భర్తీ అయ్యేది ఇతనేనా?

ఈటల రాజేందర్ సొంత  నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ హుజురాబాద్‌లో ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ స్థానిక‌ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వారం క్రిత‌మే పెద్దిరెడ్డి కేసీఆర్‌ను క‌లిసిన‌ట్టుగా స‌మాచారం. దీన్ని బ‌ట్టి ఈటల‌ను బయటకు పంపించాలని కేసీఆర్ ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది.ఈటలను వెళ్లిన వెంటనే పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు. ఈటలను బయటకు పంపించి పెద్దిరెడ్డికి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ బాధ్యతలు  అప్పజెప్పాలనే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఉన్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో పెద్దిరెడ్డి.. మంత్రిగానే కాకుండా టీడీపీ ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత దేవేంద‌ర్ గౌడ్‌తో క‌లిసి న‌వ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ త‌ర్వాత ఆ పార్టీని ప్ర‌జారాజ్యంలో విలీనం చేశారు. కొన్నాళ్లు మ‌ళ్లీ టీడీపీలోకి తిరిగివ‌చ్చారు. తెలంగాణ వ‌చ్చాక టీడీపీ బ‌లం త‌గ్గిపోవ‌డంతో.. ఇటీవ‌లే ఆయ‌న బీజేపీలో చేరారు. నిజానికి ఈట‌ల రాజేంద‌ర్ ను చాలా రోజులుగానే దూరం పెడుతున్నారు కేసీఆర్. రెండోసారి అధ

పేద విశ్వకర్మలకు రూ. 10 వేలు, 50 కిలోల బియ్యం ఇవ్వాలి

నిరుపేద విశ్వకర్మల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని, దాదాపు గతేడాది నుంచి ఉపాధి కోల్పోయి, ఆకలితో పస్తులుంటున్న నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబాలు తెలంగామలో వేలాదిగా ఉన్నాయని, వారికి చేయూతనందించాలని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్యసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కౌలే జగన్నాథం విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 10 వేల రూపాయలు, 50 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జగన్నాథం-వెంకటలక్ష్మి దంపతుల 37 ఏళ్ల పెళ్లిరోజు సందర్భంగా పలువురు విశ్వబ్రాహ్మణ సమాజం నాయకులు.. ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో  వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్యసంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, బహదూర్ పురా మండలాధ్యక్షుడు వలబోజు రవికిరణ్ చారి, ప్రధాన కార్యదర్శి మారోజు రవీంద్రాచారి, సైదాబాద్ మండలాధ్యక్షుడు వొరువాల వీరేశ్ చారి, ప్రధానకార్యదర్శి మేడిపల్లి వెంకటేశంచారి తదితరులు పాల్గొన్నారు.   

తెలంగాణలో విశ్వబ్రాహ్మలకు ఒరిగింది శూన్యం

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఖమ్మం జిల్లాకు చెందిన బ్రహ్మశ్రీ ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మను నియమించారు. ఆదివారం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసినట్లు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వనాథుల పుష్పగిరి చెప్పారు. అనంతరం ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మ మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బలోపేతం చేస్తానని, విశ్వకర్మ సమాజపు పూర్వ వైభవానికి, సంస్కృతీ పరిరక్షణకు, సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తానని, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ లక్ష్యాలకు అనుగుణంగా ఎల్లవేళలా విశ్వకర్మలందరికి అందుబాటులో ఉంటానని ప్రమాణం చేశారు. సాధించుకున్న తెలంగాణలో విశ్వకర్మలకు ఒరిగింది ఏమీ లేదని, ప్రభుత్వ పథకాలు సైతం విశ్వకర్మ సమాజానికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఎందరో విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని, తమ కుల సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తనవంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని శ్రీనివాస్ విశ్వకర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ విశ్వబ్

వీకెండ్ స్టోరీ: హండ్రెడ్ పర్సెంట్ హరామ్

ఈ మధ్య కొద్ది నెలలుగా టెండర్ కట్స్ పేరుతో ఓ భారీ వ్యాపార ప్రకటన ఖరీదైన ఇంగ్లిష్ పేపర్లో, ఫ్రంట్ పేజ్‍లో దర్శనమిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో మటన్, చికెన్, ఎగ్స్, ఫిష్, ప్రాన్స్.. ఇలా మాంసాహార ఉత్పత్తులు మీరు కోరుకున్న చోటికి డోర్ డెలివరీ అంటూ ఊదరగొడుతోంది. ఇప్పుడైతే హైదరాబాద్ లోని 11 సెంటర్లలో టెండర్ కట్స్ దుకాణాలు రెడీ అయ్యాయని కూడా తాజాగా మరో ప్రకటన వెలువడింది. అది వ్యాపార ప్రకటన కాబట్టి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ యాడ్ లో చక్కగా బొట్టు పెట్టుకున్న ఈ హిందూ మహిళ చేత ఎంతో గర్వంగా పోజిప్పించి టెండర్ కట్స్ మాంసానికి బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎడమవైపు పైన 100 PER CENT HALAL అంటూ స్టార్ గుర్తులో హైలైట్ చేయడమే ఈ నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి దారితీస్తోంది.  హలాల్ అనేది ముస్లింల విశ్వాసాల ప్రకారం దేవునికి సమర్పించుకునే నైవేద్యం. ముస్లిమేతరులు ముస్లిమేతర పద్ధతుల్లో సమర్పించుకునే నైవేద్యాన్ని సంప్రదాయ ముస్లింలు ఎవరూ ముట్టుకోరు. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా చెబుతున్న షరియా సూత్రాలను ఇండియన్ ముస్లింలు పెద్దసంఖ్యలో తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బయటి దేశా

వీకెండ్ స్టోరీ- ఆధునిక ఆదర్శ హిందూ వివాహం ఇదే

హిందూ సమాజ వ్యవస్థ ఎంత సంక్లిష్టమైందో... అంత సానుకూలమైంది కూడా. అయితే అనుకూలతలు అటుంచి కేవలం సంక్లిష్టతలు మాత్రమే ఎత్తిచూపే ప్రబుద్ధులు తమ దుర్బుద్ధిని మార్చుకోవాల్సిన సందర్భాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అందుకు కరీంనగర్‍లో జరిగిన తాజా పెళ్లే ఓ ఉదాహరణ.  డిసెంబర్ 23వ తేదీన కరీంనగర్ లో జరిగిన సహస్ర-మహేశ్‍ల పెళ్లి కులాతీత ఆధునిక హిందూ ఆదర్శ వివాహానికి ఓ ఆనవాలుగా నిలిచిపోతుంది. ఎందుకంటే పెళ్లికూతురు, పెళ్లికొడుకు, పెళ్లిపెద్దలు.. ఇలా ముగ్గురూ మూడు సామాజికవర్గాలకు చెందినవారు కావడం విశేషం. సహస్ర (ముదిరాజ్), మహేశ్ (మేరు)తో పాటు పెళ్లిపెద్దలైన రాజ్‍కుమార్-అన్నపూర్ణ (విశ్వబ్రాహ్మణ) వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వీరెవరూ రక్త సంబంధీకులు కాకపోయినా, అమ్మాయి-అబ్బాయిల కులపెద్దల మద్దతు కోసం ఎదురుచూడకుండా.. కేవలం అమ్మాయి-అబ్బాయి కుటుంబాలతో ఉన్న పాత పరిచయం, స్నేహాన్నే ఆత్మబంధంగా భావించి యువజంటను ఒక్కటి చేశారు. ఖర్చులకు వెనుకాడకుండా బంధువర్గం, ఉద్యోగ స్నేహితులు.. ఇలా అందరూ మెచ్చేలా అంగరంగ వైభవంగా సహస్ర పెళ్లిబాధ్యతలు పూర్తి చేశారు. నేటి కాలానికి అవసరమైన అసలైన హిందూ ఆదర్శ వివాహాన్ని ఆచరించి చూపారు.

తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర?

Also Read:   ఆవు పేడతో చెప్పుల తయారీ Weekend Story:   కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ప్రభుత్వాలు కంటికి కనిపించని కుట్రలకు పాల్పడతాయా? అలాంటి అవకాశం ఉంటుందా? రాజకీయాలను, వాటి చుట్టూ పెనవేసుకున్న ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ఏమైనా జరగొచ్చని అనిపించక మానదు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫలితాలను కాస్త లోతుగా పరిశీలిస్తే లోపాలతో పాటు.. కొన్ని కుట్రలు కూడా జరిగాయన్న విషయం తెలుస్తుంది.  అధికార టీఆర్ఎస్, దూకుడు మీదున్న బీజేపీకి ఓట్ల శాతం చాలా తక్కువగా నమోదైంది. 35.73 శాతంతో 11,92,162 ఓట్లతో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. 35.55 శాతంతో 11,86,096 ఓట్లు సాధించిన బీజేపీ రెండో స్థానంలో ఉంది. అంటే టీఆర్ఎస్ కు, బీజేపీకి 0.18 శాతం ఓట్ల స్వల్ప దూరం మాత్రమే ఉందన్నమాట. ఒక్క శాతం తేడా కూడా లేని ఓట్ల శాతంతో జీహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఇక 18.91 శాతంతో 6,30,867 ఓట్లు మాత్రమే పొందిన ఎంఐఎం 44 డివిజన్లలో జెండా ఎగరేసి మూడో స్థానంతో తన పట్టు నిలుపుకోగలిగింది. ఇక కాంగ్రెస్ 6.61 శాత

జానారెడ్డికి గవర్నర్‍గిరీ?

జనమెరిగిన నాయకుడు జానారెడ్డికి….. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటారనే పేరుంది. నియాజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఆయనలో ఉంది. కాంగ్రెస్ కు అధికారం వస్తే ముఖ్యమంత్రి రేసులో ముందుండే వ్యక్తి ఆయనే. గతంలోనే ఆయన తన కుమారుడికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం రాలేదు. అలాంటి జానారెడ్డి బీజేపీలో చేరతారా? కమలనాథులు జానాకు గవర్నర్ పదవి ఆఫర్ చేశారా.. ? లేక జానారెడ్డినే తనకు గవర్నర్‍గిరీ కావాలని, తన కుమారుడికి నాగార్జునసార్ ఉపఎన్నిలల్లో టికెట్ ఇవ్వాలని అడిగారా? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది.  నాగార్జునసాగర్ ఎంఎల్ఏ నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో జానారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై చర్చకు దారితీసింది. సాగర్ కు జరిగే ఉపఎన్నిలను తమకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని మరోమారు చాటి చెప్పాలని చూస్తున్న బీజేపీ నేతలు.. అందుకు సాగర్లో తగిన నాయకుడు జానారెడ్డే కాబట్టి ఆయన్ను ఎలాగైనా తమ పార్టీలోకి లాగాలని గట

ఆవు పేడతో చెప్పులు.. త్వరలో మార్కెట్‍లోకి

Main Story:   జానారెడ్డికి గవర్నర్‍గిరీ? Also Read:   పాక్ మెడలు వంచిన రోజు ఇదే   Also Read:   ఎంఐఎంతో పొత్తుకు తహతహ ఇందుకేనా? Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ఆవు పేడ ఏంటి.. చెప్పుల తయారీ ఏంటి.. అనుకుంటున్నారు కదా. మీరు వింటున్నది నిజమే. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఆవుకు మంచి డిమాండే ఉంటుందని ఊహించవచ్చు. హైదరాబాద్ లో ఉంటున్న అమిత్ భట్నాగర్ దాదాపు 20 ఏళ్లకు పైగా పంచగవ్య చికిత్స విషయంలో పని చేస్తున్నారు. తాను తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో చాలా మంది గో ప్రేమికులు, ఆత్మీయ సహచరులు పాలుపంచుకుంటున్నారని భట్నాగర్ చెబుతారు . ఆవు విసర్జితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేయాలన్నదే అమిత్ భట్నాగర్ సంకల్పం. హైదరాబాద్ తో పాటు పాత కరీంనగర్ జిల్లాలోని మంథనిలో వీరి ఆధ్వర్యంలో గోశాలలు నడుస్తున్నాయి. అంతేకాదు.. రాజస్తాన్ లో వీరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గో ఉత్పాదనల ప్రాజెక్టు నడుస్తోంది.  వీరి రీసెర్చ్ వల్లే ఆవు పేడ నుంచి అనేక కొత్త రకాల ఉత్పాదనలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఆవు పేడ నుంచి అందరూ ఆశ్చర్యపోయేలా కాగితాన్ని తయారు చేశా

జానారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా?

కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జూనారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకంటే వేరే ఆప్షన్ కూడా ఆయనకు లేదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాంగ్రెస్ దెబ్బతిన్న క్రమంలో ఢిల్లీలో ఆయనకంటూ పెద్దదిక్కు ఎవరూ లేకపోవడం ఆయనకు పెద్దమైనస్ పాయింట్. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక.. ఆ స్థానాన్ని రేవంత్ చేత భర్తీ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ ఎంపిక కూడా దాదాపుగా ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ దూకుడును, పోకడను, రాకడను ససేమిరా అంటున్న సీనియర్లు మాత్రం రేవంత్ వస్తే తాము పార్టీలో ఉండే ప్రశ్నే లేదని భీష్మించుక్కూర్చున్నారు. రేవంత్ వస్తే తమ ప్రాధాన్యత అసలు ఏమాత్రం లేకుండా పోతుందని, ఇన్నాళ్లూ ఉనికి చాటుకున్న పార్టీలో అసలు ఉనికే లేకుండా పడిఉండడం తమ వల్ల కాదని వారంటున్నారు. అందుకే దాదాపు గత ఏడాదిన్నరగా రేవంత్ టీ-పీసీసీ అనౌన్స్ మెంట్ ను తొక్కి పెట్టినట్లు సమాచారం. అయితే గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుపడే సూచనలేవీ కనిపించకపోవడంతో ఇదే అదనుగా ఉత్

30 సర్కిళ్లు.. 30 కౌంటింగ్ సెంటర్లు.. సీసీ టీవీ కెమెరాలు

గ్రేటర్ హైదరాబాద్ ను మొత్తం 30 సర్కిళ్లుగా విభజించి అందులో డివిజన్లు/వార్డులవారీ ఎన్నికలు నిర్వహించారు. ఒక్కో సర్కిల్లో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ వరకు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్ కి 14 టేబుల్స్, ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. 30 సర్కిళ్లకు 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్ లో ఉన్న సర్కిల్స్, డివిజన్ల వివరాలు ఇవీ..  1) కాప్రా సర్కిల్ : 1) కాప్రా 2) ఏఎస్ రావు నగర్ 3) చెర్లపల్లి 4) మీర్‍పేట్ హెచ్బీ కాలనీ 5) మల్లాపూర్ 6) నాచారం 2) ఉప్పల్ సర్కిల్ : 7) చిలుకనగర్ 8) హబ్సిగూడ 9) రామంతాపూర్ 10) ఉప్పల్ 3) హయత్‍నగర్ సర్కిల్: 11) నాగోల్ 12) మన్సూరాబాద్ 13) హయత్‍నగర్ 14) బీఎన్ రెడ్డినగర్ 4) ఎల్బీనగర్ సర్కిల్: 15) వనస్థలిపురం 16) హస్తినాపురం 17) చంపాపేట్ 18) లింగోజిగూడ 5) సరూర్‍నగర్ సర్కిల్: 19) సరూర్‍నగర్ 20) ఆర్కేపురం 21) కొత్తపేట 22) చైతన్యపురి 23) గడ్డిఅన్నారం 6) మలక్‍పేట్ సర్కిల్: 24) సైదాబాద్ 25) మూసారంబాగ్ 26) ఓల్డ్ మలక్‍పేట్ 27) అక్బర్‍బాగ్ 28) అజాంపురా 29) చావని 30) డబీర్‍పురా 7) సంతో

సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న సస్పెన్స్ వీడేందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇవాళ ఓల్డ్ మలక్ పేట డివిజన్లో జరుగుతున్న రీపోలింగ్ దృష్ట్యా క్షేత్రస్థాయిలో సర్వే చేసిన పలు ప్రైవేటు సంస్థలు కూడా 1వ తేదీన ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదల చేయలేకపోయాయి. అయితే ఈ సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికలపై సర్వే నిర్వహిస్తున్న ఆరా సంస్థ ఈ సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.  Also Read:   బీజేపీ కొత్త ఆపరేషన్                            గ్రేటర్ కౌంటింగ్.. వివరాలివే                          గ్రేటర్ పై పోల్ సర్వేలు ఏం చెప్తున్నాయి? మొన్న దుబ్బాక ఎన్నికల్లో కూడా ఆరా సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పోరు భీకరంగా జరిగినా కారు గెలుస్తుందని చెప్పింది. కానీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. దీంతో గ్రేటర్ పోల్ విషయంలో మరింత పకడ్బందీగా అంచనాలు విడుదల చేయాలని ఆ సంస్థ అధిపతి మస్తాన్ వలీ భావిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రైవేటు సంస్థలు కూడా

న గల్లీ తుమ్హారా.. న ఢిల్లీ తుమ్హారా..

ఇది మా ఇలాకా.. ఇక్కడెవరి పప్పులూ ఉడకవు.. ఉడకనివ్వం అనుకొని విర్రవీగుతుంటే.. ఆ పప్పులు ఉడకబెట్టే మనిషెవరో  ఎక్కడి నుంచో దిగి వస్తాడు. రాక తప్పదు. అలా రాకపోతేనే ప్రమాదం. గల్లీ పేరు జెప్పి ఢిల్లీని కొడతానంటే.. ఢిల్లీలో కూర్చున్నవాడు గల్లీలో వేలు పెట్టక తప్పదు. దాన్ని సమర్థించినవాడు దీన్ని కూడా సమర్థించాలి. లేదు.. నా ఇష్టం నాదే అంటే.. ఎవరిష్టం వారిదే అని కూడా అంగీకరించాల్సిందే. అలాంటప్పుడు బలమున్నవాడిదే బడితె... బర్రె కూడా.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో పర్యటిస్తున్నారు. పర్యటించడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన వేలు కూడా పెట్టారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి అంతటి ఆయువుపట్టు తెచ్చింది సినిమా ఇండస్ట్రీనే. సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొనే అక్కడి రాజకీయాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాలు, ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన శివసేన కూడా హిందుత్వ ఎజెండాతో పాదుకొని సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకుంది. మొన్న కంగనా రనౌత్ ను ఇబ్బంది పెట్టినా, అంతకుముందు అర్నాబ్ గోస్వామిని వెంటాడినా ఆ బలుపు చూసుకునే అనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. శివసేన మొన్నటి బిహార్ ఎన్నికల్లో క

గీ పట్నపోల్లకు ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది.. అని తెలుగు ప్రజలంతా ఆశ్చర్యపోవాల్సిన సందర్భమిది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీ పోరాడి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని తహతహలాడాయి. గతంలో కంటే ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సగం కన్నా ఎక్కువ అనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. మరి ప్రజల్లో 50 శాతం పోలింగ్ కానప్పుడు దాన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించవచ్చా? అది మేలైన ప్రజాస్వామ్యమేనా అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు? కేంద్రమో, రాష్ట్రాలో దీనికోసం పూనుకోవాల్సిన అవసరం లేదా? (పాఠకులు ఇబ్బంది అనుకోకుండా తెలంగాణ స్లాంగ్ లో చదువుకోవాలని మనవి) గీ పట్నపోల్లకు ఏమైంది? యూత్ పోరలు, సదువుకున్నోల్లు, జాబుల్ జేసేటోల్లు యాడ వోయిండ్రు? మొన్నటి సంది జెప్తనే ఉన్నం గదా... ఓట్లేసుడంటే ప్రజాస్వామ్య పండుగ అన్జెప్తన్నం గదా.. మల్లేమాయె. అరె.. మొన్న బీజేపీ పెద్దసార్లయితే ఓ మునుం బెట్టి పట్నానికచ్చిండ్రు గదా. అమిత్ సార్ గల్లీ మార్చ్ సౌండూ.. డిల్లీదాక పాకింది గదా. గా షో జూత్తెనైతే ఇగ హైదరాబాద్ జనం పోలింగ్ బూత్ ల కాడ లైన్ల మీద లైన్లు గట్టి ఓట్లకోసం

ఎగ్జిట్ పోల్ సర్వే లేనట్టే

Also Read:   సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలెలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. అలాంటివారు 3వ తేదీ సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే. ఓల్డ్ మలక్ పేట బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు (కంకి కొడవలికి బదులు సుత్తె కొడవలి) అచ్చయ్యాయి. ఈ వార్త మీడియాలో హైలైట్ గా మారింది. దీంతో సీపీఎం నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఓల్డ్ మలక్ పేట ఎన్నికను అధికారులు రద్దు చేశారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరూ విడుదల చేయరాదని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో 3వ తేదీన రీపోలింగ్ తరువాతే ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలవుతాయి.  Also Read:  గీ పట్నపోల్లకు ఏమైంది? వాస్తవానికి దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హైదరాబాద్ ఎన్నికలపై వోటర్ నాడి రికార్డు చేసేందుకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. విడతలవారీగా సర్వేలు నమోదు చేస్తూ ఆసక్తికరంగా మారుతున్న గ్రౌండ్ వివరాలను అంచనా వేస్తూ తుది నిర్ణయం వెలువరించేందుకు కసరత్తు చేస్తున్నాయి.  Also Read:  హైదరాబాద్ పోల్ - హైటెన్షన్                          గ్రేటర్ పై సర్వేలు ఏం చెబుతున్నాయి?