ప్రకృతి మనిషి లాగా ప్రశ్నించదు. కానీ దాని టైమ్ వచ్చినప్పుడు ఉరుముతుంది.. గర్జిస్తుంది... ఆ ఫెళఫెళార్భాటాలకు ఈ అల్ప మానవుడు చచ్చి ఊరుకుంటాడు. అప్పుడు ప్రశ్నించడానికి ఎవరూ మిగలరు. అందుకే అదే ప్రకృతి కాస్త బుర్ర అనే పదార్థాన్నిచ్చి విజ్ఞత-వివేకాలు అనే మనో నేత్రాలను కూడా ఇచ్చింది. దాన్ని గ్రహించలేని మనిషి ఊరికే నోరుంది కదాని ప్రతిదాన్నీ ప్రశ్నిస్తూ అనవసరంగా ప్రకృతి ఆగ్రహానికి గురవుతున్నాడు. ఆ ఆగ్రహం నుంచి కాస్తయినా ఉపశమనం కలిగించేదే 9 నిమిషాల లైట్సాఫ్ ప్రిన్సిపుల్. ఆ 9 నిమిషాల్లో ఏం జరుగుతుందో ఓసారి చూడండి.
ఏప్రిల్ 5న రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశమంతా కొన్ని కోట్ల కుటుంబాలు ఒక్కసారిగా లైట్లు ఆఫ్ చేస్తాయి. అంటే.. దేశం మొత్తమ్మీద 15 గిగా వాట్ల పవర్ జనరేషన్ ఆగిపోతుంది. ఎంత బొగ్గు, ఎన్ని నీళ్లను ఆ తక్కువ టైమ్ లో కాపాడుతున్నామో చూడండి. కోట్లాది కుటుంబాలు ఒకేసారి లైట్లు ఆఫ్ చేసి, దీపాలు వెలిగిస్తే.. ఆ దీపాల వెలుగు కంటికి ఎంత ఎనర్జీ ఇస్తుందో గ్రహించారా? ఎన్ని వేలు, లక్షల మెగావాట్ల పవర్ ఆదా అవుతుందో ఊహించారా? ఎన్ని వేల టన్నుల బొగ్గు గానీ, ఎంత పెద్దమొత్తంలో నీరు గానీ సేవ్ అవుతాయో ఓసారి అంచనా వేయండి. అంతేకాదు.. 9 నిమిషాల తరువాత మళ్లీ క్రమంగా లైట్లు ఆన్ చేసుకోవడం మొదలవుతుంది. అంటే గ్రిడ్ కు అనుసంధానమైన పవర్ జెనరేటర్లు అన్నీ పూర్వస్థాయిలో విద్యుదుత్పత్తి చేయడానికి (డిమాండ్ ను బట్టి) ఒక గంట పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దేశం మొత్తమ్మీద ఒక గంట "ఎర్త్ అవర్" ఆదా అవుతుందన్నమాట. ఇదంతా ప్రకృతికి ఎంత మేలు చేసే అంశం. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే.. ప్రకృతి మనకు ఎలా బతకాలో నేర్పిస్తుంది. అది చెప్పినట్టు నడుచుకుంటే మనకు సుఖ సంతోషాలిస్తుంది ప్రకృతిమాత. ఒక్క 9 నిమిషాల పవర్ సేవింగ్ లో, దీపాలు వెలిగించి చేసే ప్రకృతి ఆరాధనలో కొన్నేళ్ల పాటు పనికొచ్చే వనరుల్ని మనకు ధారాదత్తం చేసే శక్తిని ఈ భూమండలం నింపుకుంటుంది. 9 నిమిషాల్లో ఏం జరుగుతుంది బ్రదర్.. అని మెటికలు విరిచే మెటీరియలిస్ట్ లు చాలా మందే ఉంటారు. వారినలా ఉండనిద్దాం.
పొల్యూషన్ పూర్తిగా ఆగిపోయిన ఆ తొమ్మిది నిమిషాల్లో ఎన్ని వేల టన్నుల ఆక్సిజన్ దేశ ఉపరితలం మీద పరుచుకుంటుందో ఓసారి ఊహించుకోండి. ఆ ఆక్సిజన్ ఎన్ని విషవాయువుల్ని బలహీనం చేస్తుందో అర్థం చేసుకోండి. పర్యావరణంలో దుష్టశక్తులు అంటే అవే కదా. మన కంటికి కనిపించనంత మాత్రాన ప్రకృతి దాని పని అది చేసుకోదు అనుకుందామా? అంత స్వచ్ఛమైన ఆక్సిజన్... ఓజోన్ పొరకు ఎంత బలాన్నిస్తుందో ఒక్కసారి అంచనా వేయండి. ఒక పేషెంట్ కు వైద్యుడేం చెప్తాడు? నీ రోగం కుదరాలంటే రెస్ట్ తీసుకో... ఇంటిపట్టునే ఉండు.. ఫలావా వస్తువులు తినకు.. ఫలానా వస్తువులు తిను.. అని మాత్రమే చెప్తాడు తప్ప.. తానిచ్చే మందులో ఏముంది? అది నీ శరీరంలోకి వెళ్లి ఏం చేస్తుంది? ఎలా పనిచేస్తే నువ్వు కుదుటపడతావు.. అని చెప్తాడా? చెప్పడు కదా. మరి ఆ చిన్న టాబ్లెట్ శరీరం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు లైట్సాఫ్ చేయడం కూడా అలాంటిదే.
కాబట్టి ప్రకృతి అనేది కరోనా రూపంలో ఓ సవాల్ విసిరి ఎలాగైనా బతకి తీరాలని నీకు ఆపత్కాలంగా సూచిస్తే.. అదే ప్రకృతికి వెన్నుదన్నునిచ్చే కార్యక్రమం ద్వారా ఎలా బతకాలో చెప్పే విజ్ఞత కూడా మనిషికి ప్రకృతే ఇచ్చింది అని మనం గుర్తించాలి. అదే కదా.. మన ప్రధాని ప్రతిపాదించిన సామూహిక లైట్సాఫ్ కార్యక్రమం. దీనిద్వారా మనిషి నేర్చుకోవాల్సిన పాఠమేంటి? మనిషి మోడువారిన మానులా బతకడం కాదు.. పచ్చనైన చెట్టులా బతకాలని పెద్దలు చెప్పింది ఇందుకే.
Comments
Post a Comment
Your Comments Please: