Skip to main content

2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే మనుగడ - హార్వర్డ్ యూనివర్సిటీ


Photo Credit: Shiksha.com


సామాజిక దూరాన్ని పూర్తి నిక్కచ్చిగా అమలు చేస్తేనే కరోనా వైరస్ ను శాశ్వతంగా నిర్వీర్యం చేయగలమని, పరిమిత దినాల పాటు లాక్ డౌన్ పాటించి ఆ తరువాత పాత పద్ధతుల్లోనే ఉంటామంటే కుదరదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నిర్వహించిన తాజా అధ్యయనం చెబుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అండ్ ఇన్పెక్షియస్ డిసీసెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు ఎం.కిస్లర్, యోనాతన్ హెచ్. గ్రాడ్ అనే ఇద్దరు ప్రొఫెసర్లు కరోనా విజృంభణ, వ్యాప్తి, దాని జీవితకాలంపై అధ్యయనం చేశారు. 



వైరస్ సోకిన వ్యక్తి కేవలం 14 రోజులో, లేక 21 రోజులో క్వారంటైన్ లో ఉన్నంతమాత్రాన వైరస్ పూర్తిగా పోవడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు మందు గానీ, టీకా గానీ రానందువల్ల అది రావడానికి నెలల నుంచి ఏళ్లు  కూడా పట్టే అవకాశం ఉన్నందువల్ల వైరస్ వ్యాప్తి జరగకుండా చూడడమే మార్గం తప్ప.. పాజిటివ్ బారిన పడి కోలుకున్న వ్యక్తిలో వైరస్ లేనట్టు భావించరాదని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 పై పనిచేసే మందుకోసం ఇప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి.. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. దాదాపు ఏడాది నుంచి 2 ఏళ్లయినా కావచ్చని పలువురు వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పడాన్ని గమనించాలి. 
అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నదాని ప్రకారం వైరస్ సోకిన వ్యక్తి రోగ నిరోధక శక్తి కారణంగా అది ఉన్నట్టు కనిపించకపోవచ్చు. కానీ బతికే ఉంటుందని వారు అప్రమత్తం చేస్తున్నారు. అది సోకిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వెంటనే బయటపడుతుంది. అంతేకాదు.. సంపూర్ణ ఆరోగ్యవంతుడికి సోకినా అతని రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని వారంటున్నారు. అలాగే ఒకసారి వైరస్ బారినపడిన వ్యక్తి కోలుకున్నట్టు కనిపించినా కూడా అతను వైరస్ వాహకంగానే కొనసాగుతాడని వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వైరస్ ను సమూలంగా నిర్మూలించాలంటే టీకా మందు గానీ, ట్రీట్ మెంట్ గానీ వచ్చేదాకా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనని వారంటున్నారు. వారి అంచనా ప్రకారం ఎక్కువలో ఎక్కువ 2024 వరకు సామాజిక దూరాన్ని అవలంబించి తీరాలి. వైరస్ చనిపోయినట్టు లేదా నిర్వీర్యమైపోయినట్టు కనిపించినా మనిషి రోగ నిరోధక శక్తిని బట్టి, మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి అది పునరుత్తేజమవుతుందని, ఆ వైరస్ మోస్తున్న వ్యక్తి రోగ నిరోధక శక్తిపై, ఆరోగ్య వ్యవస్థపై దాడి చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే... ఇటీవల కొందరికి నెగటివ్ వచ్చిన వ్యక్తికి సైతం పాజిటివ్ తేలడం, అలాగే పాజిటివ్ గా తేలి క్వారంటైన్ లో కోలుకొని నెగిటివ్ వచ్చినవారికి సైతం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ గా రావడాన్ని గమనించాలి. 


2022 వరకు సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే


హార్వర్డ్ శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం ప్రపంచమంతా 2022 వరకు సామాజికదూరాన్ని కచ్చితంగా పాటించాలి. అంటే వైరస్ ను చంపే ట్రీట్ మెంట్ గానీ, టీకా గానీ వచ్చేదాకా అన్నమాట. ఈ లోపు ప్రపంచమంతా ఒక కొత్త పంథాలోకి వెళ్లిపోవడం ఖాయం. ముుఖ్యంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అనేది గతకాలపు అలవాటుగా మారిపోతుంది. భారతీయ సంప్రదాయ నమస్కారం లేదా తల వంచి విష్ చేయడం లాంటివే అలవాటుగా మారతాయి. ఆఫీసులు, పని ప్రదేశాల్లో కొత్త కల్చర్ ఊపిరి పోసుకుంటుంది. పక్కపక్కనే పనిచేసే డెస్కుల మధ్య దూరం పెరుగుతుంది. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థుల్ని కుక్కేసి బోధించే పద్ధతులకు కాలం చెల్లుతుంది. మరోవైపు సాధారణ అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా ఆన్ లైన్ లో అడుగుపెట్టి విద్యార్థులకు, లెక్చరర్లకు అదే అలవాటుగా మారుతుంది. మన దగ్గర ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్య వంటి పెద్ద కాలేజీలు ఆన్ లైన్ ఏర్పాట్లు చేస్తుండటాన్ని గమనించాలి. శుచి-శుభ్రతకు అమిత ప్రాధాన్యం పెరుగుతుంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తే లోపలేసే కొత్త చట్టం రావడాన్ని గమనించాలి. విదేశీ ప్రయాణాలు, రాకపోకల్లో తరచుదనం తగ్గుతుంది. విమానాల్లోనే కాదు.. బస్సులు, రైళ్లలో కూడా సీటింగ్ అరేంజ్ మెంట్స్ మార్చుకోవాల్సి వస్తుంది. కొనుగోళ్లు, అమ్మకాలను పెంచుకునే బిజినెస్ టూర్లకు బ్రేక్ పడుతుంది. మనుషులు కిక్కిరిసి ఉండే మురికివాడలు, ఒకే రూఫ్ కింద 3 తరాలు కాపురాలుంటున్న ఓల్డ్ సిటీ లాంటి ప్రదేశాలపై కొత్త నిబంధనలు తీసుకురావాల్సి ఉంటుంది. 
ఇలా 2022 వరకు సోషల్ డిస్టెన్స్ ను స్ట్రిక్టుగా పాటిస్తేనే కరోనా వైరస్ నిర్వీర్యమవుతుంది. లేకపోతే ఏదొక స్థాయిలో నిద్రాణంగా ఉన్న వైరస్ కాస్తా... 2024 వరకు మళ్లీ పంజా విసిరే అవకాశం ఉందనేది హార్వర్డ్ శాస్త్రవేత్తల అంచనా. వారి హెచ్చరికను వెంటనే అమలు చేస్తే ఆహార అలవాట్ల దగ్గర నుంచి వ్యాపార వ్యవహారాల దాకా మానవ జీవన శైలి మొత్తం మారిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు. 


Also Read: తెరమీదికొస్తున్న పాత సంప్రదాయాలు ఇవే


                  నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా?


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత