Skip to main content

రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ కథ తెలుసుకోవాలనుందా?

తొంభయ్యవ దశకంలో వచ్చిన ద్రోహి సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. రక్షక దళాలకు పెనుసవాలుగా మారడమే గాక దేశ ఆంతరంగిక భద్రతకూ ప్రమాదకరంగా మారిన  తీవ్రవాదుల్ని తుదముట్టించే ఇతివృత్తంతో 1990ల్లో వచ్చిన ద్రోహి సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నక్సలైట్ల ఆనుపానులు, రక్షణపరమైన రహస్యాలు, భారీ దాడుల కోసం చేసే వ్యూహాలు తెలుసుకొనేందుకు.. పోలీసు అధికారులే రహస్యంగా నక్సలైట్ గ్రూపులోకి సిబ్బందిని పంపించి.. వారిని మట్టుపెట్టడం అందులోని ట్విస్ట్. అచ్చంగా అలాంటి అండర్ కవర్ ఆపరేషన్నే రియల్ లైఫ్ లో ఇప్పటికీ నిర్వహిస్తున్న ఇండియన్ జేమ్స్ బాండ్ గా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 



మోడీ ప్రధాని అయిన నాటి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ పరమైన నిర్ణయాల్లో దోవల్ పాత్రే కీలకం. సర్జికల్ స్ట్రైక్స్‌ నుంచి డోక్లాం సమస్యలో చర్చలు, నిన్న మొన్నటి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో భద్రత వరకు ఆయనే అన్నీ తానై నడిపారు. అంతేకాదు కశ్మీర్‌లో పౌరులకు ఎలాంటి ఢోకా లేదని చెప్పేందుకు సాధారణ పౌరుడిగా కశ్మీర్ వీధుల్లో తిరుగుతున్నారు.

అజిత్ దోవల్‌ తీరు ముందు నుంచి భిన్నమే. ఆయన కుటుంబ నేపథ్యం కూడా భారత ఆర్మీకి సంబంధించిందే. దోవల్ తండ్రి ఆర్మీ మేజర్‌గా పని చేశారు. దీంతో చిన్ననాటి నుంచే దోవల్‌కు దేశ భద్రతా వ్యవహారాలపై ఆసక్తి ఎక్కువ. 1968లో కేరళ కేడర్‌ నుంచి ఐపీఎస్ సర్వీసుల్లో చేరారు. నాటి నుంచి పలు కీలక ఆపరేషన్లకు సూత్రధారిగా వ్యవహరించారు. కాందహార్ ఫ్లైట్ హైజాక్‌ సమయంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన బృందంలో దోవల్‌ కూడా సభ్యుడు. ఇలా కీలక సందర్భాల్లో దోవల్ సమయస్పూర్తితో వ్యవహరించారు. అందుకే రిటైర్మెంట్ సమయానికే దోవల్‌ కెరీర్‌ పరంగా పలు విజయాలు నమోదు చేసుకున్నారు.

చూసేందుకు సాధారణ పౌరుడిలా కనిపించే దోవల్‌ వెనుక భాషా సినిమాలో రజనీకాంత్ కు ఉన్నంత బ్యాక్ గ్రౌండ్ ఉంది. పాకిస్థాన్‌లో గూఢచర్యం కోసం ఆయన ఏడేళ్ల పాటు ముస్లిం పౌరుడిలా గడిపారు. అచ్చంగా చెప్పాలంటే కమల్ హాసన్ మూవీ ద్రోహీలో చేసినట్లుగా...పాకిస్థాన్‌లో ఉంటూ అక్కడి సమాచారాన్ని ఇండియాకు చేరవేశారు. ఒకానొక సమయంలో ఓ వ్యక్తి ఆయన్ను హిందువుగా గుర్తుపట్టారు. కానీ అతను కూడా హిందువు కావడంతో దోవల్‌కు ముప్పు తప్పింది. పాక్‌ సైన్యంతో ఒక సామాన్య పౌరుడిలా కలిసిపోయారు దోవల్. అదే సమయంలో పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఉన్న అనుబంధంపై సమాచారం సేకరించారు.  చుట్టూ కరుడుగట్టిన ఉగ్రవాదులు, భారత వ్యతిరేకుల మధ్య సాహసోపేతంగా, అంతకంటే ఎక్కువ చాణక్యత ప్రదర్శిస్తూ...పాక్ ఆటకట్టే ప్లాన్లు వేశారు. గూఢచారిగా ఏడేళ్లు తిరగడమే కాదు, పాక్‌ రాయబార కార్యాలయంనూ అధికారిగా పని చేశారు దోవల్. అందుకే పాక్ ఎత్తులపై దోవల్‌కు పూర్తి అవగాహన ఉంది.

కేవలం పాకిస్థాన్‌లో అండర్ కవర్ ఆపరేషన్ మాత్రమే కాదు, దోవల్ జీవితంలో ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇండియాలో కూడా ఆయన సామాన్య వ్యక్తిలా జనంలోకి వెళ్తారు. సిక్కుల స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ ను విజయవంతం చేయడంలో దోవల్ వేసిన స్కెచ్ సామాన్యమైనది కాదు. కరుడుగట్టిన ఉగ్రవాదులు చుట్టుముట్టిన స్వర్ణ దేవాలయంలోకి ఒక రిక్షావాలాగా ప్రవేశించారు. అక్కడి కీలక సమాచారాన్ని భద్రతా బలగాలకు చేరవేశారు. అంతేకాదు 2014లో ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇరాక్‌లో ఉగ్రవాదులు అపహరించుకుపోయిన 46 మంది భారత నర్సులను సురక్షితంగా విడిపించారు.

శత్రుదేశాల్లో గూఢచర్యం చేయడం వల్ల వారికి ఆయన ఆయా దేశాలకు ద్రోహిలా కనిపించవచ్చు, కానీ భారత్‌కు మాత్రం అజిత్ దోవల్ ఒక హీరో. అందుకే సైనికులకు మాత్రమే దక్కే కీర్తి చక్ర అవార్డు పొందిన తొలి ఐపీఎస్ అధికారిగా దోవల్ నిలిచారు. దోవల్‌ సర్వీసు మొత్తం సాహసాలతోనే గడుస్తోంది. తాజాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా జమ్మూకశ్మీర్ స్థానికులతో కలిసి ఆయన వీధుల్లో కలియ తిరిగారు. అక్కడ గ్రౌండ్ రిపోర్టును ఉన్నది ఉన్నట్లుగా కేంద్రానికి తెలియజేసేందుకు సాధారణ పౌరుడిలా మారారు. 


- టి.రమేశ్ బాబు


- 9032003022


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత